Movie News

పునీత్ కోసం బెంగళూరులో చరణ్..

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్లో చాలామంది సినీ ప్రముఖులకు బాగా క్లోజ్. కన్నడ సినీ చరిత్రలోనే అతి పెద్ద కథానాయకుడైన రాజ్ కుమార్ తనయుడు కావడం, పైగా పెద్ద హీరో కావడం, మంచి వ్యక్తిగా పేరుండటంతో పునీత్‌తో టాలీవుడ్ ప్రముఖులు చాలామందికి ముందు నుంచి మంచి సంబంధాలున్నాయి. ఈ అనుబంధంతోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్.. ఇంకా పలువురు పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఐతే ఆ టైంలో పుణెలో శంకర్‌తో చేస్తున్న సినిమా షెడ్యూల్లో బిజీగా ఉండటం, షూటింగ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరుతో పాటుగా పునీత్ పార్థివ దేహ సందర్శనకు వెళ్లలేకపోయాడు. ఐతే ఇప్పుడు షెడ్యూల్ ముగియడంతో పుణె నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులను చరణ్ పరామర్శించాడు.

చరణ్.. పునీత్ చిత్ర పఠం ముందు నివాళి అర్పిస్తున్న, శివరాజ్ కుమార్ పక్కన కూర్చుని ఓదారుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం చరణ్ మీడియాతో మాట్లాడాడు. పునీత్‌తో తన అనుబంధం గురించి గుర్తు చేసుకున్నాడు. పునీత్ చనిపోవడంతో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లే ఉందని.. ఇలా ఎవరికైనా జరగొచ్చని, కానీ పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చరణ్ అన్నాడు. పునీత్ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి అని.. అందరితో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తాడని చెప్పాడు. పునీత్ తన ఇంటికి కూడా వచ్చాడని.. అప్పుడు అతడి ముందు తాము అతిథులం అయ్యామని.. అంతగా అందరినీ ఓన్ చేసుకుంటాడని .. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలనడానికి పునీత్ ఉదాహరణ అని.. అతనంటే తనకెంతో ఇష్టమని, తనను చాలా మిస్ అవుతున్నానని చరణ్ అన్నాడు.

suman

Recent Posts

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

42 minutes ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

3 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

4 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

7 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

10 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

11 hours ago