‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వనప్పటికీ.. శ్రీలీల అందానికి యూత్ ఫిదా అయిపోయింది. ఆమె హావభావాలు దర్శకనిర్మాతలను ఆకట్టుకున్నాయి. పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండడంతో అందరి దృష్టి శ్రీలీలపై పడింది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కాకముందే రవితేజ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాపై అఫీషియల్ గా సైన్ చేసిందని సమాచారం.
దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి చేయబోయే రెండో సినిమాకి శ్రీలీలను హీరోయిన్ గా ఫైనల్ గా చేసుకున్నారు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ మీదే చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ ను తీసుకున్నారట. దిల్ రాజు నిర్మించిన చాలా సినిమాలకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. రైటర్ గా చంద్రబోస్ ను తీసుకున్నారు.
ఇక ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయం బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే.. హీరో-హీరోయిన్-మ్యూజిక్ డైరెక్టర్ లను ఫైనల్ చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. మొత్తానికి శ్రీలీల దిల్ రాజు బ్యానర్ లో ఆఫర్ కొట్టేసింది. దీంతో పాటు ఆమె చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి!
This post was last modified on November 3, 2021 6:43 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…