2022 సంక్రాంతి సినిమాల గత కొన్ని నెలల్లో చాలా ట్విస్టులు చూశాం. పండక్కి ముందు అనుకున్న సినిమాలైతే హరిహర వీరమల్లు, సర్కారు వారి పాట మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆల్రెడీ రేసు నుంచి తప్పుకుంది. ‘సర్కారు వారి పాట’ పక్కా అంటే పక్కా అన్నారు కానీ.. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి రేసులో నిలిచిన మరో పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా పండక్కి రావడం డౌట్గానే ఉంది. ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’.. 14న ‘రాధేశ్యామ్’ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే ఈ రెండు మాత్రమే రేసులో ఉండేట్లయితే తన సినిమా ‘బంగార్రాజు’ను రిలీజ్ చేయడానికి నాగ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పై రెండు భారీ చిత్రాలతో పోలిస్తే తనది పూర్తి భిన్నమైన సినిమా అని, పండుగ టైంలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని, అలాగే ఓవర్ ఫ్లోస్ కలిసొస్తాయని.. ఇలా నాగ్ లెక్కలు నాగ్కు ఉన్నాయి.
ఇంతటితో సంక్రాంతి పందెం కోళ్ల సంగతి ఫిక్స్ అయినట్లేనా అంటే అలా ఏమీ కనిపించడం లేదు. కొత్తగా ఇప్పుడు సంక్రాంతి రేసులోకి మరో సినిమా వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే.. శేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం కొన్ని నెలలుగా అసలు వార్తల్లో లేదు.
ఐతే కరోనా నుంచి కోలుకున్నాక రాజశేఖర్ సైలెంటుగా ఈ సినిమాను పున:ప్రారంభించి చకచకా లాగించేస్తున్నారట. సినిమా పూర్తి కావస్తోందట. సంక్రాంతికి నాలుగు సినిమాలొచ్చినా ప్రేక్షకులు చూస్తారని.. తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమాను పండుగ రేసులో నిలబెడితే ఈజీగా పాసైపోవచ్చని అనుకుంటున్నారట. మలయాళ హిట్ ‘జోసెఫ్’కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లలిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. రాజశేఖఱ్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాజశేఖర్ తెల్లటి గడ్డంతో నడి వయస్కుడిగా కనిపించనున్నాడు.
This post was last modified on November 3, 2021 6:37 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…