ఏమో అనుకున్నాం కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ మామూలు సినిమా కాదని.. ‘బాహుబలి’కి దీటుగా ఉండబోతోందని.. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను రాజమౌళి షేక్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. సినిమా మొదలైనప్పుడు ఉన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విడుదల ముంగిట ‘బాహుబలి’ తరహా యుఫోరియానే ఈ చిత్రం కూడా క్రియేట్ చేస్తోంది.
‘ఆర్ఆర్ఆర్ నుంచి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా అది గూస్ బంప్స్ ఇచ్చేస్తోంది. సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ఫస్ట్ టైటిల్ టీజర్ దగ్గర్నుంచి తాజాగా రిలీజ్ చేసిన 45 సెకన్ల గ్లింప్స్ వరకు ప్రతిదీ నోరెళ్లబెట్టి చూసేలాగే ఉంది. కాకపోతే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వస్తున్న వీడియో గ్లింప్స్తో ఒక సమస్య ఉంటోంది. రామ్ చరణ్, తారక్ల పాత్రలకు సంబంధించిన టీజర్స్ అయినా.. మేకింగ్ వీడియో అయినా.. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అయినా ఫాస్ట్ ఫార్వార్డ్లో నడవడమే ఆ సమస్య.
వీటిలో ఏ ఒక్క షాట్ కూడా ఒక్క క్షణం నిడివితో కూడా లేదు. రెప్పపాటలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. సినిమా కాన్సెప్ట్ ఏంటో.. ఎవరి పాత్రలు ఎలా ఉంటాయో.. ఏం హైలైట్స్ ఏంటో ఆగి ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. వీడియోను స్లో మోషన్లోకి మార్చి.. స్క్రీన్ షాట్లు తీసుకుని ఎవరికి తోచిన భాష్యాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. మరీ ఇంత ఫాస్ట్ ఫార్వార్డ్ వీడియోలు చేసి జనాలను ఇంత ఊరించడమేంటి.. ఒకటి రెండయితే ఓకే కానీ.. ప్రతిసారీ ఇలాగే ఉంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కనీసం ట్రైలర్లో అయినా ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్ పక్కన పెట్టి నార్మల్ మోడ్లో నెమ్మదిగా సాగేలా కట్ ఉంటే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హైలైట్లను ముందే విప్పి చూపించేయడం ఇష్టం లేక జక్కన్న ఇలా ఫ్లాష్ లాగా చూపించి ఊరిస్తున్నాడేమో కానీ.. దీని వల్ల ప్రేక్షకుల్లో ఒకరకమైన అసహనం కూడా కలుగుతోంది. కాబట్టి ట్రైలర్ విషయంలో రూట్ మారిస్తే బెటర్.
This post was last modified on November 3, 2021 6:38 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…