ఏమో అనుకున్నాం కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ మామూలు సినిమా కాదని.. ‘బాహుబలి’కి దీటుగా ఉండబోతోందని.. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను రాజమౌళి షేక్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. సినిమా మొదలైనప్పుడు ఉన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విడుదల ముంగిట ‘బాహుబలి’ తరహా యుఫోరియానే ఈ చిత్రం కూడా క్రియేట్ చేస్తోంది.
‘ఆర్ఆర్ఆర్ నుంచి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా అది గూస్ బంప్స్ ఇచ్చేస్తోంది. సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ఫస్ట్ టైటిల్ టీజర్ దగ్గర్నుంచి తాజాగా రిలీజ్ చేసిన 45 సెకన్ల గ్లింప్స్ వరకు ప్రతిదీ నోరెళ్లబెట్టి చూసేలాగే ఉంది. కాకపోతే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వస్తున్న వీడియో గ్లింప్స్తో ఒక సమస్య ఉంటోంది. రామ్ చరణ్, తారక్ల పాత్రలకు సంబంధించిన టీజర్స్ అయినా.. మేకింగ్ వీడియో అయినా.. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అయినా ఫాస్ట్ ఫార్వార్డ్లో నడవడమే ఆ సమస్య.
వీటిలో ఏ ఒక్క షాట్ కూడా ఒక్క క్షణం నిడివితో కూడా లేదు. రెప్పపాటలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. సినిమా కాన్సెప్ట్ ఏంటో.. ఎవరి పాత్రలు ఎలా ఉంటాయో.. ఏం హైలైట్స్ ఏంటో ఆగి ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. వీడియోను స్లో మోషన్లోకి మార్చి.. స్క్రీన్ షాట్లు తీసుకుని ఎవరికి తోచిన భాష్యాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. మరీ ఇంత ఫాస్ట్ ఫార్వార్డ్ వీడియోలు చేసి జనాలను ఇంత ఊరించడమేంటి.. ఒకటి రెండయితే ఓకే కానీ.. ప్రతిసారీ ఇలాగే ఉంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కనీసం ట్రైలర్లో అయినా ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్ పక్కన పెట్టి నార్మల్ మోడ్లో నెమ్మదిగా సాగేలా కట్ ఉంటే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హైలైట్లను ముందే విప్పి చూపించేయడం ఇష్టం లేక జక్కన్న ఇలా ఫ్లాష్ లాగా చూపించి ఊరిస్తున్నాడేమో కానీ.. దీని వల్ల ప్రేక్షకుల్లో ఒకరకమైన అసహనం కూడా కలుగుతోంది. కాబట్టి ట్రైలర్ విషయంలో రూట్ మారిస్తే బెటర్.
This post was last modified on November 3, 2021 6:38 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…