తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది సమంత. బ్రేకప్ తరువాత తను బాగానే ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క తన బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది.
ఇక కెరీర్ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకోవడంతో వరుస సినిమాలు సైన్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా, అలానే మరో బైలింగ్యువల్ సినిమా చేయబోతుంది.
ఇవి కాకుండా.. కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తన మొదటి బాలీవుడ్ సినిమాను మాత్రం తాప్సీ బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతోందట సమంత. రీసెంట్ గానే తాప్సీ సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. దీనికి అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ అనే పేరు కూడా పెట్టింది.
బాలీవుడ్ లో ఈ బ్యానర్ పేరు హాట్ టాపిక్ అయింది. కావాలనే తాప్సీ అవుట్ సైడర్స్ అనే పేరు పెట్టిందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో విమెన్ సెంట్రిక్ సినిమా చేయబోతుంది సమంత. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది కాకుండా.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సమంతతో వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…