తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది సమంత. బ్రేకప్ తరువాత తను బాగానే ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క తన బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది.
ఇక కెరీర్ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకోవడంతో వరుస సినిమాలు సైన్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా, అలానే మరో బైలింగ్యువల్ సినిమా చేయబోతుంది.
ఇవి కాకుండా.. కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తన మొదటి బాలీవుడ్ సినిమాను మాత్రం తాప్సీ బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతోందట సమంత. రీసెంట్ గానే తాప్సీ సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. దీనికి అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ అనే పేరు కూడా పెట్టింది.
బాలీవుడ్ లో ఈ బ్యానర్ పేరు హాట్ టాపిక్ అయింది. కావాలనే తాప్సీ అవుట్ సైడర్స్ అనే పేరు పెట్టిందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో విమెన్ సెంట్రిక్ సినిమా చేయబోతుంది సమంత. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది కాకుండా.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సమంతతో వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…