తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది సమంత. బ్రేకప్ తరువాత తను బాగానే ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క తన బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది.
ఇక కెరీర్ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకోవడంతో వరుస సినిమాలు సైన్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా, అలానే మరో బైలింగ్యువల్ సినిమా చేయబోతుంది.
ఇవి కాకుండా.. కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తన మొదటి బాలీవుడ్ సినిమాను మాత్రం తాప్సీ బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతోందట సమంత. రీసెంట్ గానే తాప్సీ సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. దీనికి అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ అనే పేరు కూడా పెట్టింది.
బాలీవుడ్ లో ఈ బ్యానర్ పేరు హాట్ టాపిక్ అయింది. కావాలనే తాప్సీ అవుట్ సైడర్స్ అనే పేరు పెట్టిందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో విమెన్ సెంట్రిక్ సినిమా చేయబోతుంది సమంత. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది కాకుండా.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సమంతతో వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…