గత కొన్నేళ్లలో సౌత్ ఇండియాలో అత్యధికంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ పేరు ముందు చెప్పుకోవాలి. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో అద్భుత అభినయం ప్రదర్శించి, ఆ సినిమాతో భారీ విజయాన్నందుకోవడంతో కీర్తి కోసం హీరోయిన్ ప్రధాన కథలు వెతుక్కుంటూ వచ్చాయి.
పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఇలా వరుసగా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇవి అటు ఇటుగా కరోనా టైంలోనే పూర్తయి.. విడుదలకు సిద్ధమయ్యాయి. ఐతే పెంగ్విన్, మిస్ ఇండియా గత ఏడాదే ఓటీటీ ద్వారా రిలీజై కీర్తి అభిమానులకు తీవ్ర నిరాశ మిగల్చడగా.. ఎప్పుడో పూర్తయిన గుడ్ లక్ సఖి చిత్రమే అడ్రస్ లేకుండా పోయింది. ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకుని చాలా నెలలైపోయింది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాదా అని సందేహిస్తున్న సమయంలో ఇటీవల కీర్తి పుట్టిన రోజు సందర్భంగా కమింగ్ సూన్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ చిత్రానికి విడుదల తేదీ కూడా ఖరారైంది. నవంబరు 26న గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరులో వివిధ భాషల్లో పెద్ద సినిమాలు రిలీజ్కు రెడీ అవుతుండగా.. నవంబరులో చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే రిలీజవుతున్నాయి. ఈ వరుసలో గుడ్ లక్ సఖిని కూడా థియేటర్లలోకి దించేస్తున్నారు.
హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి క్లాసిక్స్ తీసిన విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మధ్యలో బడ్జెట్ సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు టేకప్ చేయడం విశేషం. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కీర్తి.. గిరిజన తెగకు చెందిన ఆర్చర్ పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ గుడ్ లక్ సఖికి సంగీతాన్నందించాడు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…