టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అద్దెకు తీసుకున్న ఫాంహౌస్ లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్న వైనాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బయటపెట్టారు. మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి.. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా చెబుతున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్స్ కాలనీలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో పేకాటను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి చేశారు.
ఈ సందర్భంగా రూ.6.77లక్షల నగదును.. 33 మొబైల్ ఫోన్లు.. 29 పేకాట సెట్లతో పాటు రెండు కాసినో కాయిన్లు.. మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రిటైర్డు ఐఏఎస్ అధికారికి చెందిన ఒక ఇంటిని నాగశౌర్య కొద్దికాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. ఈ కాలనీలోని చాలా ఇళ్లను సినీ రంగానికి చెందిన పలువురు అద్దెకు తీసుకోవటం.. సీరియల్స్.. సినిమా నిర్మాణం కోసం వినియోగిస్తుంటారు.
హీరో నాగశౌర్య ఇంటిని అద్దెకు తీసుకున్నప్పటికి.. దాన్ని గుట్ట సమన్ కుమార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇంటిని ఎవరు అద్దెకు తీసుకున్నారన్న అంశం మీద మాత్రం పోలీసులు సరైన సమాచారం ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఈ ఉదంతంపై విచారణ చేస్తామని.. తమ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని మాత్రం వారు చెబుతున్నారు.
ఈ ఉదంతం టాలీవుడ్ లో కలకలాన్ని రేపింది. పేకాట మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఆగ్రహంగా ఉంటారో తెలిసిందే. అయినప్పటికీ ఇలాంటి పనులు చేయటం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on November 1, 2021 11:46 am
కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…