Movie News

ఆ సినిమాతో మ‌ళ్లీ స్క్రీన్‌పై పునీత్‌

క‌న్న‌డ ఫిలిం ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్ల‌లో ఒక‌డైన పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాత్తుగా గుండెపోటుతో క‌న్నుమూయ‌డం అత‌డి అభిమానుల‌కు తీరని వేదన మిగిల్చేదే. కేజీఎఫ్ మూవీతో యశ్ రేంజ్ మారిపోయింది కానీ.. లేకుంటే శాండిల్‌వుడ్లో పునీతే నంబ‌ర్ వ‌న్ హీరో అని చెప్పొచ్చు. ఆ స్థాయి హీరో మంచి ఫాంలో ఉండ‌గా.. 46 ఏళ్ల‌కే క‌న్నుమూయ‌డం మామూలు షాక్ కాదు.

చివ‌ర‌గా యువ‌ర‌త్న సినిమాతో ప‌ల‌క‌రించిన పునీత్‌.. ఈ మ‌ధ్యే ద్విత్వ అనే భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. లూసియా, యుట‌ర్న్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ డైరెక్ష‌న్లో కేజీఎఫ్ నిర్మాత‌లు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీయాల‌నుకున్నారు. ఈ చిత్రంతో పునీత్ రేంజే మారిపోయేద‌న్న అంచ‌నాలున్నాయి అభిమానుల్లో. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ముందే పునీత్ వెళ్లిపోయాడు. ఈ సినిమాను పూర్తిగా ఆపేయ‌డ‌మో.. లేక వేరే హీరోతో తీయ‌డ‌మో చేయొచ్చు.

ఐతే పునీత్ మ‌ళ్లీ స్క్రీన్ మీద క‌నిపించ‌డ‌నేమీ లేదు. అత‌డి సినిమా ఒక‌టి చివ‌రి ద‌శ‌లో ఉంది. అదే.. జేమ్స్. దీని షూటింగ్ కొంచెమే మిగిలుంది. పునీత్ అయితే త‌న వ‌ర‌కు టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడ‌ట‌. ఇంకేవైనా స‌న్నివేశాలు మిగిలున్నా వాటిని ప‌క్క‌న పెట్టేయ‌డ‌మే. పునీత్‌తో సంబంధం లేని స‌న్నివేశాలుంటే పూర్తి చేసి సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేయ‌డం ఖాయం. కాక‌పోతే పునీత్‌కు వేరే వాళ్ల‌తో డ‌బ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది.

ఇలా పునీత్ సినిమాలో అత‌డి పాత్ర‌కు వేరొక‌రి గొంతు వినిపించ‌డం ఏదోలా ఉంటుంది. కానీ పునీత్ న‌టించిన చివ‌రి సినిమాను అలా వ‌దిలేయ‌లేరు కాబ‌ట్టి, అభిమానుల‌కు చివ‌ర‌గా పునీత్‌ను వెండితెర‌పై చూసుకోవ‌డానికైనా దీన్ని రిలీజ్ చేయ‌డం ప‌క్కా. బ‌హుశా వ‌చ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టిన రోజు నాడు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయొచ్చ‌ని శాండిల్ వుడ్ మీడియా వ‌ర్గాలంటున్నాయి.

This post was last modified on October 31, 2021 11:35 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

55 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago