కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం అతడి అభిమానులకు తీరని వేదన మిగిల్చేదే. కేజీఎఫ్ మూవీతో యశ్ రేంజ్ మారిపోయింది కానీ.. లేకుంటే శాండిల్వుడ్లో పునీతే నంబర్ వన్ హీరో అని చెప్పొచ్చు. ఆ స్థాయి హీరో మంచి ఫాంలో ఉండగా.. 46 ఏళ్లకే కన్నుమూయడం మామూలు షాక్ కాదు.
చివరగా యువరత్న సినిమాతో పలకరించిన పునీత్.. ఈ మధ్యే ద్విత్వ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. లూసియా, యుటర్న్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ డైరెక్షన్లో కేజీఎఫ్ నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. ఈ చిత్రంతో పునీత్ రేంజే మారిపోయేదన్న అంచనాలున్నాయి అభిమానుల్లో. కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి ముందే పునీత్ వెళ్లిపోయాడు. ఈ సినిమాను పూర్తిగా ఆపేయడమో.. లేక వేరే హీరోతో తీయడమో చేయొచ్చు.
ఐతే పునీత్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించడనేమీ లేదు. అతడి సినిమా ఒకటి చివరి దశలో ఉంది. అదే.. జేమ్స్. దీని షూటింగ్ కొంచెమే మిగిలుంది. పునీత్ అయితే తన వరకు టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడట. ఇంకేవైనా సన్నివేశాలు మిగిలున్నా వాటిని పక్కన పెట్టేయడమే. పునీత్తో సంబంధం లేని సన్నివేశాలుంటే పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేయడం ఖాయం. కాకపోతే పునీత్కు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది.
ఇలా పునీత్ సినిమాలో అతడి పాత్రకు వేరొకరి గొంతు వినిపించడం ఏదోలా ఉంటుంది. కానీ పునీత్ నటించిన చివరి సినిమాను అలా వదిలేయలేరు కాబట్టి, అభిమానులకు చివరగా పునీత్ను వెండితెరపై చూసుకోవడానికైనా దీన్ని రిలీజ్ చేయడం పక్కా. బహుశా వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టిన రోజు నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని శాండిల్ వుడ్ మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on October 31, 2021 11:35 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…