కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం అతడి అభిమానులకు తీరని వేదన మిగిల్చేదే. కేజీఎఫ్ మూవీతో యశ్ రేంజ్ మారిపోయింది కానీ.. లేకుంటే శాండిల్వుడ్లో పునీతే నంబర్ వన్ హీరో అని చెప్పొచ్చు. ఆ స్థాయి హీరో మంచి ఫాంలో ఉండగా.. 46 ఏళ్లకే కన్నుమూయడం మామూలు షాక్ కాదు.
చివరగా యువరత్న సినిమాతో పలకరించిన పునీత్.. ఈ మధ్యే ద్విత్వ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. లూసియా, యుటర్న్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ డైరెక్షన్లో కేజీఎఫ్ నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. ఈ చిత్రంతో పునీత్ రేంజే మారిపోయేదన్న అంచనాలున్నాయి అభిమానుల్లో. కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి ముందే పునీత్ వెళ్లిపోయాడు. ఈ సినిమాను పూర్తిగా ఆపేయడమో.. లేక వేరే హీరోతో తీయడమో చేయొచ్చు.
ఐతే పునీత్ మళ్లీ స్క్రీన్ మీద కనిపించడనేమీ లేదు. అతడి సినిమా ఒకటి చివరి దశలో ఉంది. అదే.. జేమ్స్. దీని షూటింగ్ కొంచెమే మిగిలుంది. పునీత్ అయితే తన వరకు టాకీ పార్ట్ అంతా పూర్తి చేసేశాడట. ఇంకేవైనా సన్నివేశాలు మిగిలున్నా వాటిని పక్కన పెట్టేయడమే. పునీత్తో సంబంధం లేని సన్నివేశాలుంటే పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేయడం ఖాయం. కాకపోతే పునీత్కు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాల్సి ఉంటుంది.
ఇలా పునీత్ సినిమాలో అతడి పాత్రకు వేరొకరి గొంతు వినిపించడం ఏదోలా ఉంటుంది. కానీ పునీత్ నటించిన చివరి సినిమాను అలా వదిలేయలేరు కాబట్టి, అభిమానులకు చివరగా పునీత్ను వెండితెరపై చూసుకోవడానికైనా దీన్ని రిలీజ్ చేయడం పక్కా. బహుశా వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టిన రోజు నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చని శాండిల్ వుడ్ మీడియా వర్గాలంటున్నాయి.
This post was last modified on October 31, 2021 11:35 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…