పునీత్ రాజ్ కుమార్ ఎంత మంచివాడు, గొప్పవాడు అన్నది అతడి మరణానంతరం ఎక్కువమందికి తెలుస్తోంది. అతను 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు నడుపుతున్నాడని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్యతలు చూస్తున్నాడని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థను నడుపుతున్నాడని.. తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా అని అబ్బురపడుతున్నారు.
ఐతే పునీత్ మరణంతో వాళ్లందరి భవితవ్యం ఏమవుతుందో అన్న ఆందోళనా నెలకొంది. అయితే తమిళ హీరో విశాల్.. పునీత్ ద్వారా సాయం పొందుతున్న 1800 మంది పిల్లల చదువుకు తన వంతుగా సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. తన కొత్త చిత్రం ఎనిమీ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతనీమేరకు ప్రకటన చేశాడు.
పునీత్ గురించి అందరూ బాధపడుతున్న టైంలో ఎనిమీ ఈవెంట్ చేయడం ఇబ్బందిగానే ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన విశాల్.. పునీత్ లేడనే విషయం ఇంకా ఏదో కలలాగే ఉందని.. ఆ విషయాన్ని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదని చెప్పాడు. అతడి మరణం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకే కాక.. సమాజానికి కూడా పెద్ద లోటని అతనన్నాడు. సినిమా పరిశ్రమలో అంత ఒదిగి ఉండే వ్యక్తి మరొకరిని చూడలేదని.. ఇంట్లో అయినా బయట అయినా.. మేకప్ వేస్కున్నా.. వేసుకోకున్నా.. పునీత్ ఒకేలా.. ఎంతో ఒదిగి ఉంటాడని విశాల్ చెప్పాడు.
పునీత్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసి ఒక వ్యక్తి ఇంత చేయగలడా అని ఆశ్చర్యపోయానని.. పునీత్ స్నేహితుడిగా అతడి అండతో చదువుతకుంటున్న 1800 మంది పిల్లలకు తన సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. వచ్చే ఏడాది ఆ ఫౌండేషన్కు వెళ్లి వారి కోసం తాను ఏం చేయగలనో అంతా చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడు.
This post was last modified on October 31, 2021 11:32 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…