పునీత్ రాజ్ కుమార్ ఎంత మంచివాడు, గొప్పవాడు అన్నది అతడి మరణానంతరం ఎక్కువమందికి తెలుస్తోంది. అతను 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు నడుపుతున్నాడని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్యతలు చూస్తున్నాడని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థను నడుపుతున్నాడని.. తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా అని అబ్బురపడుతున్నారు.
ఐతే పునీత్ మరణంతో వాళ్లందరి భవితవ్యం ఏమవుతుందో అన్న ఆందోళనా నెలకొంది. అయితే తమిళ హీరో విశాల్.. పునీత్ ద్వారా సాయం పొందుతున్న 1800 మంది పిల్లల చదువుకు తన వంతుగా సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. తన కొత్త చిత్రం ఎనిమీ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతనీమేరకు ప్రకటన చేశాడు.
పునీత్ గురించి అందరూ బాధపడుతున్న టైంలో ఎనిమీ ఈవెంట్ చేయడం ఇబ్బందిగానే ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన విశాల్.. పునీత్ లేడనే విషయం ఇంకా ఏదో కలలాగే ఉందని.. ఆ విషయాన్ని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదని చెప్పాడు. అతడి మరణం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకే కాక.. సమాజానికి కూడా పెద్ద లోటని అతనన్నాడు. సినిమా పరిశ్రమలో అంత ఒదిగి ఉండే వ్యక్తి మరొకరిని చూడలేదని.. ఇంట్లో అయినా బయట అయినా.. మేకప్ వేస్కున్నా.. వేసుకోకున్నా.. పునీత్ ఒకేలా.. ఎంతో ఒదిగి ఉంటాడని విశాల్ చెప్పాడు.
పునీత్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసి ఒక వ్యక్తి ఇంత చేయగలడా అని ఆశ్చర్యపోయానని.. పునీత్ స్నేహితుడిగా అతడి అండతో చదువుతకుంటున్న 1800 మంది పిల్లలకు తన సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. వచ్చే ఏడాది ఆ ఫౌండేషన్కు వెళ్లి వారి కోసం తాను ఏం చేయగలనో అంతా చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…