Movie News

సంచలన చిత్రం.. రీమేక్ మొదలైంది

ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘నాయట్టు’ ఒకటి. రాజకీయ నాయకులు.. ప్రభుత్వాధినేతలు ప్రజల మధ్య కులం కుంపట్లు పెట్టి.. వ్యవస్థలను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారో.. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు ప్రభుత్వం కోసం పని చేసేవాళ్లు ఎలా బలిపశువులు అయిపోతారో ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా చూపించారు.

కొవిడ్ నేపథ్యంలో ఈ హార్డ్ హిట్టింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజై మలయాళీలనే కాక వివిధ భాషల వాళ్లను అమితంగా ఆకట్టుకుంది. మార్టిన్ ప్రకాట్ రూపొందించిన ఈ చిత్రంలో కుంచుకో బోబన్, నిమిష, జార్జ్ జోసెఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో వాళ్లు పోలీసు పాత్రలు చేశారు. సినిమా ఆ ముగ్గురి చుట్టూనే తిరుగుతుంది. కథాబలానికి తోడు కథనంలో ఉత్కంఠ.. ఈ ముగ్గురి అద్భుతమైన నటన.. దర్శకుడి ప్రతిభ తోడై సినిమా క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది.

‘నాయట్టు’ రిలీజై కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడైపోయాయి. అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్, కాస్ట్ అండ్ క్రూ ఎంపిక అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి షూట్‌కు రెడీ అయిపోయారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు.

బన్నీ వాసు, దివ్య మాధురి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. తమిళంలో జార్జ్ జోసెఫ్ చేసిన కీలక పాత్రను ఇక్కడ రావు రమేష్ చేయబోతున్నారు. ఆయన కెరీర్లో ఈ పాత్ర ఒక మైలురాయిలా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఒరిజినల్లో కుంచుకో చేసిన పాత్రను ప్రియదర్శి, నిమిష కనిపించిన క్యారెక్టర్లో అంజలి కనిపించనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించబోతున్నాడు. తక్కువ బడ్జెట్లో శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి టీం రెడీ అయింది.

This post was last modified on October 31, 2021 3:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nayattu

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

18 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

38 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago