కన్నడ సూపర్ స్టార్లలో ఒకడై పునీత్ రాజ్ కుమార్.. తన కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తి శుక్రవారం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు చాలా చాలా కష్టమవుతోంది. కొన్ని గంటలు పాటు షాక్లో ఉండిపోయిన ఫ్యాన్స్.. తర్వాత కొంచెం తేరుకుని తమ అభిమాన కథానాయకుడికి సంబంధించి మధుర జ్ఞాపకాల వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
నిన్నట్నుంచి పునీత్కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా.. ఒక సినిమాలో భాగంగా విధి రాత గురించి పునీత్ చెప్పిన డైలాగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా తిరుగుతోంది. “భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవ్వరూ మార్చలేరు”.. ఇదీ ఆ వీడియో సారాశం. ఇలా తన చిత్రాల్లో పునీత్ చెప్పి లైఫ్ ఫిలాసఫీలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇంకోవైపు తన నుంచి చివరగా విడుదలైన ‘యువరత్న’ సినిమా ప్రమోషన్ల టైంలో అభిమానుల్లో మీడియా ముందు బైట్స్ ఇస్తుంటే.. వెనుక నుంచి వచ్చి వాళ్లను పునీత్ సర్ప్రైజ్ చేసిన వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా తిరుగుతోంది. అభిమానులతో పునీత్ ఎంత ప్రేమగా వ్యవహరిస్తాడో చెప్పడానికి దీన్ని రుజువుగా చూపిస్తున్నారు. ఇక పునీత్ చివరగా కనిపించిన ఈవెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. చనిపోవడానికి ముందు రోజు రాత్రి అతను కన్నడ లెజెండరీ సంగీత దర్శకుడు గురుకిరణ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అందులో ఉపేంద్ర, గణేష్ తదితరులతో కలిసి గురుకిరణ్ కంపోజ్ చేసిన క్లాసిక్ సాంగ్స్ ఆలపించాడు. అందులో పునీత్ ఎంతో సంతోషంగా, హుషారుగా కనిపించాడు.
అలాగే దీని కంటే ముందు అతను పాల్గొన్న చివరి సినిమా ఈవెంట్ తన అన్నయ్య శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘జై భజరంగి’కి సంబంధించినదే. అందులో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్, శివరాజ్లతో కలిసి అతను సందడి చేశాడు. స్టేజ్ మీద ముగ్గురూ కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇక పునీత్ జిమ్లో వర్కవుట్లు చేస్తూనే గుండెపోటుకు గురైన నేపథ్యంలో అతడి ఫిట్నెస్ వీడియోలను కూడా అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…