మాస్ రాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమా తీయాలని ఎప్పుట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్ల కిందటే వీరి కలయికలో సినిమా రావాల్సింది. ఒక టైంలో ఈ కాంబినేషన్లో సినిమా ఖరారైందని.. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది.
‘కేశవ’ తర్వాత మాస్ రాజాతో సినిమా చేయాల్సిన సుధీర్.. అనుకోకుండా ‘రణరంగం’ సినిమాను మొదలుపెట్టాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ కొరియన్ మూవీ ఆధారంగా సాగే లేడీ ఓరియెంటెడ్ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా రవితేజ-సుధీర్ కాంబినేషన్లో సినిమా గురించి ప్రకటన రాబోతుండటం విశేషం. ఆదివారం ఈ ప్రాజెక్టు గురించి పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్ వర్మ అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ మాస్ రాజా 70వ చిత్రానికి సుధీరే దర్శకుడన్నది మాత్రం ఖరారు. రేపటి అనౌన్స్మెంట్కు సంబంధించి నేటి అప్డేట్ను స్వయంగా సుధీర్ వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎగ్జైట్ అవడం చూస్తే ఈ సినిమాకు దర్శకుడు అతనే అన్నది పక్కా. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా.. రవితేజ సొంత నిర్మాణ సంస్థ ‘ఆర్.టి.టీమ్ వర్క్స్’ కూడా భాగస్వామి కానుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో ఘనవిజయాన్నందుకున్నాక రవితేజ మంచి ఊపుమీదున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి ఒకటికి రెండు చిత్రాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటైన.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంకోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎప్పట్నుంచో అనుకుంటున్న సినిమా కూడా గత నెలలోనే సెట్స్ మీదికి వెళ్లింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుధీర్ వర్మతో మాస్ రాజా సినిమా గురించి ప్రకటన రాబోతోంది.
This post was last modified on October 30, 2021 1:22 pm
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…