మాస్ రాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమా తీయాలని ఎప్పుట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్ల కిందటే వీరి కలయికలో సినిమా రావాల్సింది. ఒక టైంలో ఈ కాంబినేషన్లో సినిమా ఖరారైందని.. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది.
‘కేశవ’ తర్వాత మాస్ రాజాతో సినిమా చేయాల్సిన సుధీర్.. అనుకోకుండా ‘రణరంగం’ సినిమాను మొదలుపెట్టాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ కొరియన్ మూవీ ఆధారంగా సాగే లేడీ ఓరియెంటెడ్ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా రవితేజ-సుధీర్ కాంబినేషన్లో సినిమా గురించి ప్రకటన రాబోతుండటం విశేషం. ఆదివారం ఈ ప్రాజెక్టు గురించి పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్ వర్మ అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ మాస్ రాజా 70వ చిత్రానికి సుధీరే దర్శకుడన్నది మాత్రం ఖరారు. రేపటి అనౌన్స్మెంట్కు సంబంధించి నేటి అప్డేట్ను స్వయంగా సుధీర్ వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎగ్జైట్ అవడం చూస్తే ఈ సినిమాకు దర్శకుడు అతనే అన్నది పక్కా. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా.. రవితేజ సొంత నిర్మాణ సంస్థ ‘ఆర్.టి.టీమ్ వర్క్స్’ కూడా భాగస్వామి కానుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో ఘనవిజయాన్నందుకున్నాక రవితేజ మంచి ఊపుమీదున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి ఒకటికి రెండు చిత్రాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటైన.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంకోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎప్పట్నుంచో అనుకుంటున్న సినిమా కూడా గత నెలలోనే సెట్స్ మీదికి వెళ్లింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుధీర్ వర్మతో మాస్ రాజా సినిమా గురించి ప్రకటన రాబోతోంది.
This post was last modified on October 30, 2021 1:22 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…