మాస్ రాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమా తీయాలని ఎప్పుట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్ల కిందటే వీరి కలయికలో సినిమా రావాల్సింది. ఒక టైంలో ఈ కాంబినేషన్లో సినిమా ఖరారైందని.. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అని వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది.
‘కేశవ’ తర్వాత మాస్ రాజాతో సినిమా చేయాల్సిన సుధీర్.. అనుకోకుండా ‘రణరంగం’ సినిమాను మొదలుపెట్టాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ కొరియన్ మూవీ ఆధారంగా సాగే లేడీ ఓరియెంటెడ్ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా రవితేజ-సుధీర్ కాంబినేషన్లో సినిమా గురించి ప్రకటన రాబోతుండటం విశేషం. ఆదివారం ఈ ప్రాజెక్టు గురించి పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సుధీర్ వర్మ అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కానీ మాస్ రాజా 70వ చిత్రానికి సుధీరే దర్శకుడన్నది మాత్రం ఖరారు. రేపటి అనౌన్స్మెంట్కు సంబంధించి నేటి అప్డేట్ను స్వయంగా సుధీర్ వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఎగ్జైట్ అవడం చూస్తే ఈ సినిమాకు దర్శకుడు అతనే అన్నది పక్కా. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా.. రవితేజ సొంత నిర్మాణ సంస్థ ‘ఆర్.టి.టీమ్ వర్క్స్’ కూడా భాగస్వామి కానుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో ఘనవిజయాన్నందుకున్నాక రవితేజ మంచి ఊపుమీదున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి ఒకటికి రెండు చిత్రాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటైన.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంకోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎప్పట్నుంచో అనుకుంటున్న సినిమా కూడా గత నెలలోనే సెట్స్ మీదికి వెళ్లింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుధీర్ వర్మతో మాస్ రాజా సినిమా గురించి ప్రకటన రాబోతోంది.
This post was last modified on October 30, 2021 1:22 pm
ఇప్పుడు ఫ్యానిజానికి అర్థమే మారిపోయింది. తమ అభిమాన కథానాయకుడి మీద ప్రేమ చూపించడం కంటే.. ఆ హీరోకు పోటీగా ఉన్న…
హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాల్లో నేను లోకల్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని…
కొంచెం డివైడ్ టాక్ వచ్చినా సరే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి వీకెండ్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. సోమవారం…
నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా తెగ ప్రచారం చేస్తున్న రామాయణ బృందం దానికి తగ్గ ప్రమోషనల్ స్ట్రాటజీ పాటించడం లేదు.…
మొన్న భారీ ఎత్తున అభిమానులను ఒక చోటికి చేర్చి ఒక మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాడు తమిళ కథానాయకుడు ధనుష్.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ సంకటం ఏర్పడింది. 2023లో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ మూసీ…