పునీత్ రాజ్కుమార్ తెలుగువాడు కాదు. తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ అతడి హఠాన్మరణంతో తెలుగు వాళ్లు కూడా తమ వాడిని కోల్పోయినంత ఆవేదన చెందుతున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగా అతడికున్న మంచి పేరుకు తోడు.. తెలుగు వారితో అతడికున్న పరోక్ష బంధం అందుకు ముఖ్య కారణం.
బెంగళూరుతో తెలుగు వారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వెళ్లి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక చిత్తూరు, కడప, అనంతపురం లాంటి జిల్లాల వాళ్లకైతే బెంగళూరుతో, కర్ణాటకతో అనుబంధం మరింత ఎక్కువ.
కన్నడలో టాప్ స్టార్గా పునీత్ గురించి, అతడి సినిమాల గురించి వాళ్లందరికీ బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా అతడి సినిమాలను అనుసరిస్తున్నారు. అతణ్ని వ్యక్తిగానూ దగ్గర్నుంచి చూస్తున్నారు. అందుకే పునీత్ చనిపోతే మన హీరో ఒకడు పోయిన బాధ వాళ్లందరినీ వెంటాడుతోంది.
ఇదిలా ఉంటే.. సినిమాల పరంగా కూడా పునీత్కు తెలుగుతో మంచి కనెక్షన్ ఉంది. హీరోగా అతడి తొలి చిత్రం అప్పును డైరెక్ట్ చేసింది మన పూరి జగన్నాథే కావడం విశేషం. తెలుగులో పూరి సెన్సేషనల్ హిట్ ఇడియట్కు మాతృక ఈ చిత్రం. ముందు అక్కడే అప్పు పేరుతో ఈ సినిమా తీసి సూపర్ హిట్ అందించాడు పునీత్కు పూరి. అప్పట్నుంచి పునీత్కు అప్పు అనేది మరో పేరుగా మారింది. తర్వాత తెలుగులో పూరి ఆంధ్రావాలా సినిమా తీస్తుండగా.. అదే స్క్రిప్టుతో ఆయన శిష్యుడు మెహర్ రమేష్.. పునీత్ను పెట్టి వీర కన్నడిగ తీశాడు. తెలుగు వెర్షన్ డిజాస్టర్ అయినా.. వీర కన్నడిగ మాత్రం సూపర్ హిట్ కావడం విశేషం.
ఆ పై పునీత్.. ఒక్కడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు లాంటి తెలుగు బ్లాక్బస్టర్ల రీమేక్ చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ సహా చాలామంది తెలుగు స్టార్లతో అతడికి మంచి అనుబంధం ఉంది. తారక్ అతడి కోసం ఓ సినిమాలో గెలాయా గెలాయా అనే పాట కూడా పాడటం విశేషం. కొన్ని నెలల కిందటే యువరత్న సినిమాతో నేరుగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన పునీత్.. ఇకపై తన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది.
This post was last modified on October 30, 2021 6:13 am
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…