పునీత్ రాజ్కుమార్ తెలుగువాడు కాదు. తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ అతడి హఠాన్మరణంతో తెలుగు వాళ్లు కూడా తమ వాడిని కోల్పోయినంత ఆవేదన చెందుతున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగా అతడికున్న మంచి పేరుకు తోడు.. తెలుగు వారితో అతడికున్న పరోక్ష బంధం అందుకు ముఖ్య కారణం.
బెంగళూరుతో తెలుగు వారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వెళ్లి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక చిత్తూరు, కడప, అనంతపురం లాంటి జిల్లాల వాళ్లకైతే బెంగళూరుతో, కర్ణాటకతో అనుబంధం మరింత ఎక్కువ.
కన్నడలో టాప్ స్టార్గా పునీత్ గురించి, అతడి సినిమాల గురించి వాళ్లందరికీ బాగా తెలుసు. ఎన్నో ఏళ్లుగా అతడి సినిమాలను అనుసరిస్తున్నారు. అతణ్ని వ్యక్తిగానూ దగ్గర్నుంచి చూస్తున్నారు. అందుకే పునీత్ చనిపోతే మన హీరో ఒకడు పోయిన బాధ వాళ్లందరినీ వెంటాడుతోంది.
ఇదిలా ఉంటే.. సినిమాల పరంగా కూడా పునీత్కు తెలుగుతో మంచి కనెక్షన్ ఉంది. హీరోగా అతడి తొలి చిత్రం అప్పును డైరెక్ట్ చేసింది మన పూరి జగన్నాథే కావడం విశేషం. తెలుగులో పూరి సెన్సేషనల్ హిట్ ఇడియట్కు మాతృక ఈ చిత్రం. ముందు అక్కడే అప్పు పేరుతో ఈ సినిమా తీసి సూపర్ హిట్ అందించాడు పునీత్కు పూరి. అప్పట్నుంచి పునీత్కు అప్పు అనేది మరో పేరుగా మారింది. తర్వాత తెలుగులో పూరి ఆంధ్రావాలా సినిమా తీస్తుండగా.. అదే స్క్రిప్టుతో ఆయన శిష్యుడు మెహర్ రమేష్.. పునీత్ను పెట్టి వీర కన్నడిగ తీశాడు. తెలుగు వెర్షన్ డిజాస్టర్ అయినా.. వీర కన్నడిగ మాత్రం సూపర్ హిట్ కావడం విశేషం.
ఆ పై పునీత్.. ఒక్కడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు లాంటి తెలుగు బ్లాక్బస్టర్ల రీమేక్ చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ సహా చాలామంది తెలుగు స్టార్లతో అతడికి మంచి అనుబంధం ఉంది. తారక్ అతడి కోసం ఓ సినిమాలో గెలాయా గెలాయా అనే పాట కూడా పాడటం విశేషం. కొన్ని నెలల కిందటే యువరత్న సినిమాతో నేరుగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన పునీత్.. ఇకపై తన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది.
This post was last modified on October 30, 2021 6:13 am
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…