పునీత్ రాజ్కుమార్ మరణవార్తని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. బేసిగ్గా కన్నడ స్టార్ హీరోనే అయినా.. అన్ని భాషల వారికీ ఆయనంటే ఇష్టం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగువారికి ఆయన బాగా పరిచయం. పైగా పునీత్ స్టార్ అయ్యింది మన తెలుగు సినిమాల రీమేక్స్తోనే. ఇడియట్, ఆంధ్రావాలా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఒక్కడు వంటి చిత్రాల కన్నడ రీమేక్స్తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు పునీత్.
ఆంధ్రావాలా రీమేక్ కారణంగా పునీత్కి ఎన్టీఆర్తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన నటించిన ‘చక్రవ్యూహ’లో ఓ పాట కూడా పాడాడు ఎన్టీఆర్. మహేష్ బాబు, బాలకృష్ణ, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్ లాంటి వారందరితోనూ కూడా మంచి స్నేహం ఉంది. అయితే చిరంజీవి అంటే పునీత్కి చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. ఆయనతో కలిసి నటించాలని కోరుకునేంత.
చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్కి వెళ్లనున్న ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకుడు. మెహర్తో మంచి రిలేషన్ ఉండటంతో తన మనసులోని మాటని అతని దగ్గర చెప్పాడట పునీత్. ‘బోళాశంకర్’లో ఓ చిన్న సీన్లో అయినా చిరంజీవితో కలిసి నటించాలని ఉందని మెహర్ని పునీత్ అడిగినట్లు తెలుస్తోంది.
అది నిజమై ఉంటే, అదే కనుక జరిగివుంటే మెగాస్టార్ని, కన్నడ సూపర్స్టార్ని ఒకే ఫ్రేమ్లో చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కి ఉండేది. కానీ చాన్స్ ఇక లేదు. తన కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు. అంత మంచి వ్యక్తి మరణం తనను కలచివేస్తోందంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on October 30, 2021 6:12 am
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…