26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు.. 1800 మంది పిల్లల దత్తత.. మైసూరలో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ.. ఇవన్నీ పునీత్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలకు రుజువులు.
పునీత్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి అతడిది ఎంత గొప్ప మనసో తెలియజేసే ఈ వివరాలతో సోషల్ మీడియా నిండిపోయింది. అతడి సేవా కార్యక్రమాలతో కూడిన వివరాలను అభిమానులు పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇండియాలో సేవా కార్యక్రమాలు చేపట్టే సినీ నటులు ఎంతోమంది ఉన్నారు.
కానీ ఈ స్థాయిలో ఛారిటీ చేసేవాళ్లు మాత్రం అరుదు. అందులోనూ చాలామంది చేసే సేవను మించి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ పునీత్ అందుకు భిన్నం. పెద్దగా ప్రచార హడావుడి లేకుండా కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడు. అతడి సేవ గురించి బతికి ఉన్నప్పటి కంటే చనిపోయాకే ఎక్కువ వివరాలు వెల్లడవుతున్నాయి.
ఒక్కడు ఇంత పెద్ద స్థాయిలో ఛారిటీ చేస్తున్నాడా అని అభిమానులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కన్నడ కంఠీరవ రాజ్కుమార్ తనయుడిగా తనమీద ఉన్న బాధ్యతను గుర్తుంచుకుని ఎప్పుడూ ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోలేదు పునీత్. 20 ఏళ్ల కెరీర్లో అతడి గురించి చిన్న కాంట్రవర్శీ లేదు. ఎవ్వరూ అతడి గురించి చిన్న విమర్శ చేసింది లేదు. చెడుగా మాట్లాడింది లేదు.
పునీత్ రాజ్ కుమార్ కాంట్రవర్శీ అని గూగుల్లో కొట్టినా.. యూట్యూబ్లో వెతికినా ఏ సమాచారం దొరకదు. తండ్రి పేరును నిలబెడుతూ ఎంతో బాధ్యతతో మెలుగుతూ అందరి మెప్పూ పొందాడు. హీరోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అతడి ప్రత్యేకత. అందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయిప్పుడు.
This post was last modified on October 30, 2021 6:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…