సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా స్పందించారు.
రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని.. అభిమానులను టెన్షన్ పడొద్దని చెప్పారు. నిజానికి కొన్ని గంటల తరువాత ఆయన ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.
కానీ శుక్రవారం నాడు పూర్తిగా డాక్టర్ల అబ్సర్వేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పడంతో అక్కడే ఉంచేశారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారనే ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…