సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా స్పందించారు.
రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని.. అభిమానులను టెన్షన్ పడొద్దని చెప్పారు. నిజానికి కొన్ని గంటల తరువాత ఆయన ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.
కానీ శుక్రవారం నాడు పూర్తిగా డాక్టర్ల అబ్సర్వేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పడంతో అక్కడే ఉంచేశారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారనే ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
This post was last modified on October 29, 2021 11:28 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…