సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా స్పందించారు.
రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని.. అభిమానులను టెన్షన్ పడొద్దని చెప్పారు. నిజానికి కొన్ని గంటల తరువాత ఆయన ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.
కానీ శుక్రవారం నాడు పూర్తిగా డాక్టర్ల అబ్సర్వేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పడంతో అక్కడే ఉంచేశారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారనే ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
This post was last modified on October 29, 2021 11:28 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…