Movie News

‘ఆర్ఆర్ఆర్’ మార్కెట్ రేంజ్ పడిపోయిందా..?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలకు మార్కెట్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా.. వందల కోట్లు కుమ్మరించి సినిమా హక్కులను కొనుక్కుంటూ ఉంటారు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి మార్కెట్ రేట్ అనుకున్నదానికంటే తక్కువ పలుకుతోంది. ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ మార్కెట్ విలువ దాదాపు ముప్పై శాతం తగ్గించి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్దగా రావడం లేదు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రేట్లు తగ్గించి అమ్ముతున్నారట.

నిజానికి ఆంధ్రా, సీడెడ్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఒక్క ఈస్ట్ ఏరియాలోని ఈ సినిమాకు రూ.18 కోట్ల డీల్ వచ్చింది. ఇప్పుడు అందులో ఐదు కోట్లు తగ్గించి రూ.13 కోట్లకు సినిమా హక్కులను ఇస్తున్నారట. ఉత్తరాంధ్రలో మొదట రూ.26 కోట్లకు సినిమా హక్కులను అమ్మారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా.. ఆ మొత్తాన్ని రూ.19 కోట్లకు కుదించారు. దాదాపు వంద కోట్ల బిజినెస్ జరగాల్సిన ఈ రెండు ఏరియాల్లో ఇప్పుడు డెబ్భై కోట్ల బిజినెస్ కూడా జరగడం లేదు.

ఆంధ్రలో మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి నైజాం, ఓవర్సీస్ బిజినెస్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ వాళ్లు కూడా తగ్గించమని అడిగితే మాత్రం బిజినెస్ పై ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రమే కాదు.. ఏపీలో పెద్ద సినిమాలన్నింటి పరిస్థితి దాదాపుగా ఇంతే. ఇంతకముందు కుదుర్చుకున్న ఒప్పందాలను ఇప్పుడు మళ్లీ సవరిస్తున్నారట. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రిలీజ్ కి ముందు ఓ ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on October 26, 2021 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago