బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్ లో ఆరోపించారు.
ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి బాడీగార్డ్ అని చెప్పుకుంటున్న ప్రభాస్ అక్టోబర్ 2న క్రూజ్ షిప్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ ని సాక్షులుగా చేర్చి విచారించింది.
ఈ అరెస్ట్ ల తరువాత కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు ప్రభాకర్. ఆ తరువాత షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో కారులోనే ఈ డీల్ గురించి పదిహేను నిమిషాల పాటు చర్చించారని ప్రభాకర్ చెప్పారు.
ఎన్సీబీ అధికారులు తనని ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని ప్రభాకర్ ఆరోపించారు. మరోపక్క కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం.. అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగడం ఖాయమనిపిస్తోంది. అయితే ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాఖండే తోసిపుచ్చినట్లుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాఖండే హెచ్చరించారు.
This post was last modified on October 25, 2021 1:25 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…