బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్ లో ఆరోపించారు.
ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి బాడీగార్డ్ అని చెప్పుకుంటున్న ప్రభాస్ అక్టోబర్ 2న క్రూజ్ షిప్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ ని సాక్షులుగా చేర్చి విచారించింది.
ఈ అరెస్ట్ ల తరువాత కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు ప్రభాకర్. ఆ తరువాత షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో కారులోనే ఈ డీల్ గురించి పదిహేను నిమిషాల పాటు చర్చించారని ప్రభాకర్ చెప్పారు.
ఎన్సీబీ అధికారులు తనని ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని ప్రభాకర్ ఆరోపించారు. మరోపక్క కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం.. అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగడం ఖాయమనిపిస్తోంది. అయితే ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని.. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాఖండే తోసిపుచ్చినట్లుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాఖండే హెచ్చరించారు.
This post was last modified on October 25, 2021 1:25 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…