మామూలుగా ఫిబ్రవరి ఆరంభం నుంచి.. మార్చి మధ్య వరకు పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడతారు. అది పరీక్షల కాలం. కాబట్టి యూత్ సినిమాలకు రావడం తగ్గిపోతుంది. వాళ్లతో పాటే ఫ్యామిలీస్ కూడా సినిమాలకు దూరంగా ఉంటాయి. అందుకే ఆ టైంలో చాలా వరకు చిన్న సినిమాలనే లాగించేస్తుంటారు.
పెద్ద సినిమాలు మార్చి నెలాఖర్లో వేసవి సీజన్ ఆరంభం ఆరంభంలో బరిలోకి దిగడం మొదలవుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా వచ్చే ఫిబ్రవరిలో ఆచార్య లాంటి భారీ చిత్రం షెడ్యూల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ చిత్రం 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా ఫిబ్రవరిలో రావడం ఏంటని మెగా అభిమానులు షాకయ్యారు రిలీజ్ డేట్ ప్రకటించినపుడు.
ఇప్పుడు మరో పెద్ద సినిమా ఫిబ్రవరి రిలీజ్కు రెడీ అయింది. అదే.. ఎఫ్-3. 2019 సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్నందుకున్న ఎఫ్-2కు సీక్వెల్గా రానున్న సినిమా ఇది. ఈ ఏడాది ఆగస్టులోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమై.. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అంత అనుకూలమైందేమీ కాదు. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా సాధించిన విజయాన్ని చూసి ఆచార్య, ఎఫ్-3 సినిమాలు ధైర్యం చేసినట్లున్నాయి.
ఉప్పెన చిన్న స్థాయి సినిమానే అయినా.. ఫిబ్రవరిలో విడుదలై ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. ఆ నెలలో పెద్దగా వసూళ్లు రావు అనే అభిప్రాయాన్ని మార్చింది. కానీ ఆ సినిమా రిలీజైనపుడు పరిస్థితులు వేరు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పెద్దగా సినిమాలు లేక జనాలు కరవులో ఉన్న టైంలో మంచి లవ్ స్టోరీ పడటం, అప్పుడు స్కూళ్లు కాలేజీలు లేక యూత్ కూడా బాగా థియేటర్లకు రావడంతో దానికి అనూహ్యమైన. వసూళ్లు వచ్చాయి. మరి రాబోయే ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయనుకుంటే పొరబాటే. జనవరిలో భారీ చిత్రాల మోత తర్వాత ఫిబ్రవరి సినిమాలకు ఏమంత ఊపు ఉంటుందన్నది డౌటు. వచ్చే ఫిబ్రవరిలో స్కూళ్లు, కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో నడిచే అవకాశం ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడొచ్చు.
This post was last modified on October 24, 2021 9:48 pm
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…