మామూలుగా ఫిబ్రవరి ఆరంభం నుంచి.. మార్చి మధ్య వరకు పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడతారు. అది పరీక్షల కాలం. కాబట్టి యూత్ సినిమాలకు రావడం తగ్గిపోతుంది. వాళ్లతో పాటే ఫ్యామిలీస్ కూడా సినిమాలకు దూరంగా ఉంటాయి. అందుకే ఆ టైంలో చాలా వరకు చిన్న సినిమాలనే లాగించేస్తుంటారు.
పెద్ద సినిమాలు మార్చి నెలాఖర్లో వేసవి సీజన్ ఆరంభం ఆరంభంలో బరిలోకి దిగడం మొదలవుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా వచ్చే ఫిబ్రవరిలో ఆచార్య లాంటి భారీ చిత్రం షెడ్యూల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ చిత్రం 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా ఫిబ్రవరిలో రావడం ఏంటని మెగా అభిమానులు షాకయ్యారు రిలీజ్ డేట్ ప్రకటించినపుడు.
ఇప్పుడు మరో పెద్ద సినిమా ఫిబ్రవరి రిలీజ్కు రెడీ అయింది. అదే.. ఎఫ్-3. 2019 సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్నందుకున్న ఎఫ్-2కు సీక్వెల్గా రానున్న సినిమా ఇది. ఈ ఏడాది ఆగస్టులోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమై.. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అంత అనుకూలమైందేమీ కాదు. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా సాధించిన విజయాన్ని చూసి ఆచార్య, ఎఫ్-3 సినిమాలు ధైర్యం చేసినట్లున్నాయి.
ఉప్పెన చిన్న స్థాయి సినిమానే అయినా.. ఫిబ్రవరిలో విడుదలై ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. ఆ నెలలో పెద్దగా వసూళ్లు రావు అనే అభిప్రాయాన్ని మార్చింది. కానీ ఆ సినిమా రిలీజైనపుడు పరిస్థితులు వేరు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పెద్దగా సినిమాలు లేక జనాలు కరవులో ఉన్న టైంలో మంచి లవ్ స్టోరీ పడటం, అప్పుడు స్కూళ్లు కాలేజీలు లేక యూత్ కూడా బాగా థియేటర్లకు రావడంతో దానికి అనూహ్యమైన. వసూళ్లు వచ్చాయి. మరి రాబోయే ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయనుకుంటే పొరబాటే. జనవరిలో భారీ చిత్రాల మోత తర్వాత ఫిబ్రవరి సినిమాలకు ఏమంత ఊపు ఉంటుందన్నది డౌటు. వచ్చే ఫిబ్రవరిలో స్కూళ్లు, కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో నడిచే అవకాశం ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడొచ్చు.
This post was last modified on October 24, 2021 9:48 pm
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…