బాహుబలి మూవీతో ప్రభాస్ ఇండియాలోనే అతి పెద్ద స్టార్గా అవతరించాడు. అతను వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. పేరున్న బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు వరుస కడుతున్నారు. ఇప్పటికే తానాజి దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఆదిపురుష్ తీస్తున్నాడు.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. కాగా బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఘనవిజయం సాధిస్తుందని.. ఈ చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా స్టార్లు అవుతారన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కూడా బాలీవుడ్ దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
ఇందుకోసం ఆర్ఆర్ఆర్ రిలీజయ్యా కొన్నాళ్ల వరకు ఎదురు చూడాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా బన్సాలీ.. మన జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. భారీతనం ఉన్న పీరియడ్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన బన్సాలీ తారక్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఊహే ఎగ్జైట్ చేసేదే. ఆదివారం ట్విట్టర్లో దీని గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి.
తారక్తో బన్సాలీ వీడియో కాల్ కూడా మాట్లాడాడని.. వీళ్లిద్దరి మధ్య చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా వచ్చే అవకాశముందని.. ఆటోమేటిగ్గా అది పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని అంటున్నారు. ఐతే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో ఏమో.. తారక్-బన్సాలీ కలయికలో సినిమా వస్తే మాత్రం అదొక సెన్సేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 24, 2021 9:43 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…