దేశ ఆర్ధిక రాజధాని ముంబై తీరంలో క్రూజ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు స్నేహితురాలైన నటి అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో వాట్సాప్ చాటింగ్ లు, ఫోటోలు, వాయిస్ నోట్స్ ను అనన్య పాండే చాలావరకు డిలీట్ చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది.
డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించడానికి ఎన్సీబీ ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్ తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్లలో కొన్ని అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్ధిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్ తో చాటింగ్ గురించి అనన్య పాండేను ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. కానీ అనన్య మాత్రం ఈ ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది.
తనకు డ్రగ్స్ అలవాటు లేదని.. డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ కు ఎలాంటి సాయం చేయలేదని.. అతడితో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని పేర్కొంది. అయితే ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తుల గురించి అనన్యకు తెలుసని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోపక్క డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
This post was last modified on October 24, 2021 12:23 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…