దేశ ఆర్ధిక రాజధాని ముంబై తీరంలో క్రూజ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు స్నేహితురాలైన నటి అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో వాట్సాప్ చాటింగ్ లు, ఫోటోలు, వాయిస్ నోట్స్ ను అనన్య పాండే చాలావరకు డిలీట్ చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది.
డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించడానికి ఎన్సీబీ ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్ తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్లలో కొన్ని అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్ధిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్ తో చాటింగ్ గురించి అనన్య పాండేను ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. కానీ అనన్య మాత్రం ఈ ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది.
తనకు డ్రగ్స్ అలవాటు లేదని.. డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ కు ఎలాంటి సాయం చేయలేదని.. అతడితో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని పేర్కొంది. అయితే ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తుల గురించి అనన్యకు తెలుసని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోపక్క డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
This post was last modified on October 24, 2021 12:23 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…