అంతా అనుకున్నట్లు జరిగితే ఈపాటి దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకంపనలు రేపుతుండాలి. దేశం మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటూ ఉండాలి. ఇండియా అంతటా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని అక్టోబరు 13వ తేదీ నుంచి సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
అంతకుముందే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ముచ్చటగా మూడోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. కొత్త రిలీజ్ డేట్ విషయంలో పరిపరి విధాల ఆలోచించి.. అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి చివరికి 2022 జనవరి 7కు సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఆర్ఆర్ఆర్ కొత్త డేట్ విషయంలో ఆ చిత్రాల బృందాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ తమకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే డేట్కు ఆర్ఆర్ఆర్ టీంకు కట్టుబడి ఉంది. కాకపోతే ఇంకా ప్రమోషన్లు మాత్రం మొదలుపెట్టలేదు. కాగా విడుదలకు సరిగ్గా రెండు నెలల ముందు ప్రమోషన్ల హోరు మొదలుపెట్టనుందట చిత్ర బృందం. ఇందుకోసం దీపావళి పండుగకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు సమాచారం.
గత ఏడాది సీతారామరాజు, కొమరం భీంల మీద వేర్వేరుగా టీజర్లు వదిలాడు రాజమౌళి. ఇప్పుడు ఇద్దరినీ కలిపి ఒక స్పెషల్ టీజర్ను రెడీ చేస్తున్నాడట. మెరుపులు మెరిపించేలా.. సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా ఈ టీజర్ ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. త్వరలోనే టీజర్ గురించి అనౌన్స్మెంట్ రానుందట.
ఈ టీజర్ తర్వాత దేశవ్యాప్తంగా భారీగానే ప్రమోషన్లు చేయడానికి ప్రణాళిక సిద్ధమైందట. సోషల్ మీడియా ప్రచారంతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, కోచి లాంటి నగరాల్లో ఈవెంట్లతో సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 24, 2021 12:36 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…