Movie News

‘మా’ ఎన్నికలు.. పాయింట్ పట్టుకున్న ప్రకాష్ రాజ్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రగడ క పట్టాన ఆగేలా లేదు. ఎన్నికలు జరిగి రెండు వారాలు కావస్తున్నా.. దాని తాలూకు వేడి మాత్రం తగ్గట్లేదు. వివాదాలు ఆగట్లేదు. ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్ దౌర్జన్యంగా వ్యవహరించిందని, అక్రమాలకు పాల్పడిందని.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పోలింగ్ రోజు సీసీటీవీ పుటేజ్ కావాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కోరుతూ ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. కానీ ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ప్రకాష్ రాజ్ పోలీసులను ఆశ్రయించడం, వాళ్లొచ్చి సీసీటీవీ రూంకి తాళాలు వేసి విచారణ ఆరంభించడం తెలిసిందే. కాగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఓ సంచలన ట్వీట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడని.. అతను విష్ణు ప్యానెల్‌కు చెందిన వాడని ఆరోపించారు.

‘మా’ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో సదరు వ్యక్తి ఉన్న ఫొటోలను కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షూట్ ఉన్న నూకల సాంబశివరావు ‘మా’ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో హల్‌చల్ చేశాడని ప్రకాష్ రాజ్ అంటున్నారు.

ఓ హత్య కేసుతో పాటు మరి కొన్ని కేసుల్లో అతను నిందితుడని, అతడిపై రౌడీ షీట్ కూడా తెరిచారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఈ వ్యక్తి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రంలో తిరిగాడని.. ‘మా’తో సంబంధం లేని ఈ వ్యక్తిని పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని.. ఇంకా ఇలాంటివి ఎన్నికల సందర్భంగా కొన్ని జరిగాయని, అందుకే సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నామని, ‘మా’ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలియాలని ప్రకాష్ రాజ్ అన్నారు. సాంబశివరావు.. మోహన్ బాబు, విష్ణు, ఏపీ సీఎం జగన్‌లతో వేర్వేరుగా ఉన్న ఫొటోలను కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో షేర్ చేశారు.

This post was last modified on October 22, 2021 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago