చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ.. భిన్నమైన నేపథ్యంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే వారు చాలా అరుదు. టాలీవుడ్ లో మహిళా నిర్మాతలే తక్కువ. అలాంటిది నిర్మాతగా వ్యవహరిస్తూ.. తానే హీరోయిన్ గా చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది. ఆమె నాట్యం మూవీ హీరోయిన్ కమ్ నిర్మాత సంధ్య రాజు. ఈ వారాంతంలో విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ముచ్చట్లు కంటే.. ఆమెకు సంబంధించిన వివరాలు కాస్త భిన్నంగా.. మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
చిన్నతనం నుంచి నాట్యం అంటే తనకు ప్రాణమని.. నిత్యం నాట్యం మీదనే తన ఆలోచనలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే పలు కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారట. ఇతరభాషల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.. అయినా సరే కమర్షియల్ మూవీస్ లో నటించే అవకాశం వచ్చినా.. తాను చేయను అని స్పష్టం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్నాం.. ఫలానా హీరోతో సినిమా చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందన్న ట్యాగులు తనకు అక్కర్లేదని.. కంటెంట్ బాగున్న సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.
నిర్మాతగా వ్యవహరిస్తూ నటిగా వ్యవహరించడం చాలా పెద్ద టాస్క్ అనిపించినట్లు చెప్పారు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కు పట్టుకురావటం చాలా కష్టంగా అనిపించినట్లు చెప్పారు. గతంలో నాట్యం మీద షార్ట్ ఫిలిం చేశామని.. దానికి ఆదరణ బాగా వచ్చినట్లు చెప్పారు. మంచి కథ.. పాత్ర వస్తేనే సినిమా చేస్తాను తప్పించి.. ఏది పడితే అది చేయనని చెప్పారు. నాట్యం మీద తనకున్న ఆసక్తిని గుర్తించిన అత్తింటి వారు సైతం తనను నిరుత్సాహానికి గురి చేయకుండా ప్రోత్సహించినట్లు చెప్పారు. మొత్తానికి హీరోయిన్లలో సంధ్యా రాజు కాస్త కాదు.. చాలానే డిఫరెంట్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 22, 2021 9:58 am
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…