చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ.. భిన్నమైన నేపథ్యంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే వారు చాలా అరుదు. టాలీవుడ్ లో మహిళా నిర్మాతలే తక్కువ. అలాంటిది నిర్మాతగా వ్యవహరిస్తూ.. తానే హీరోయిన్ గా చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది. ఆమె నాట్యం మూవీ హీరోయిన్ కమ్ నిర్మాత సంధ్య రాజు. ఈ వారాంతంలో విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ముచ్చట్లు కంటే.. ఆమెకు సంబంధించిన వివరాలు కాస్త భిన్నంగా.. మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
చిన్నతనం నుంచి నాట్యం అంటే తనకు ప్రాణమని.. నిత్యం నాట్యం మీదనే తన ఆలోచనలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే పలు కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారట. ఇతరభాషల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.. అయినా సరే కమర్షియల్ మూవీస్ లో నటించే అవకాశం వచ్చినా.. తాను చేయను అని స్పష్టం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్నాం.. ఫలానా హీరోతో సినిమా చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందన్న ట్యాగులు తనకు అక్కర్లేదని.. కంటెంట్ బాగున్న సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.
నిర్మాతగా వ్యవహరిస్తూ నటిగా వ్యవహరించడం చాలా పెద్ద టాస్క్ అనిపించినట్లు చెప్పారు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కు పట్టుకురావటం చాలా కష్టంగా అనిపించినట్లు చెప్పారు. గతంలో నాట్యం మీద షార్ట్ ఫిలిం చేశామని.. దానికి ఆదరణ బాగా వచ్చినట్లు చెప్పారు. మంచి కథ.. పాత్ర వస్తేనే సినిమా చేస్తాను తప్పించి.. ఏది పడితే అది చేయనని చెప్పారు. నాట్యం మీద తనకున్న ఆసక్తిని గుర్తించిన అత్తింటి వారు సైతం తనను నిరుత్సాహానికి గురి చేయకుండా ప్రోత్సహించినట్లు చెప్పారు. మొత్తానికి హీరోయిన్లలో సంధ్యా రాజు కాస్త కాదు.. చాలానే డిఫరెంట్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 22, 2021 9:58 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…