చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ.. భిన్నమైన నేపథ్యంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే వారు చాలా అరుదు. టాలీవుడ్ లో మహిళా నిర్మాతలే తక్కువ. అలాంటిది నిర్మాతగా వ్యవహరిస్తూ.. తానే హీరోయిన్ గా చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది. ఆమె నాట్యం మూవీ హీరోయిన్ కమ్ నిర్మాత సంధ్య రాజు. ఈ వారాంతంలో విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ముచ్చట్లు కంటే.. ఆమెకు సంబంధించిన వివరాలు కాస్త భిన్నంగా.. మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
చిన్నతనం నుంచి నాట్యం అంటే తనకు ప్రాణమని.. నిత్యం నాట్యం మీదనే తన ఆలోచనలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే పలు కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారట. ఇతరభాషల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.. అయినా సరే కమర్షియల్ మూవీస్ లో నటించే అవకాశం వచ్చినా.. తాను చేయను అని స్పష్టం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్నాం.. ఫలానా హీరోతో సినిమా చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందన్న ట్యాగులు తనకు అక్కర్లేదని.. కంటెంట్ బాగున్న సినిమాను చేస్తున్నట్లు చెప్పారు.
నిర్మాతగా వ్యవహరిస్తూ నటిగా వ్యవహరించడం చాలా పెద్ద టాస్క్ అనిపించినట్లు చెప్పారు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కు పట్టుకురావటం చాలా కష్టంగా అనిపించినట్లు చెప్పారు. గతంలో నాట్యం మీద షార్ట్ ఫిలిం చేశామని.. దానికి ఆదరణ బాగా వచ్చినట్లు చెప్పారు. మంచి కథ.. పాత్ర వస్తేనే సినిమా చేస్తాను తప్పించి.. ఏది పడితే అది చేయనని చెప్పారు. నాట్యం మీద తనకున్న ఆసక్తిని గుర్తించిన అత్తింటి వారు సైతం తనను నిరుత్సాహానికి గురి చేయకుండా ప్రోత్సహించినట్లు చెప్పారు. మొత్తానికి హీరోయిన్లలో సంధ్యా రాజు కాస్త కాదు.. చాలానే డిఫరెంట్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 22, 2021 9:58 am
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…