నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోకు హోస్ట్ అవుతాడని ఎవరైనా ఊహించారా? అది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీ కోసం ఆయన ఈ అవతారం ఎత్తుతాడని అస్సలు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఊహించనిదే జరిగింది. అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమో కూడా రిలీజైంది. కొన్ని ఎపిసోడ్ల షూట్ కూడా పూర్తి చేశాడు బాలయ్య.
తొలి సీజన్లో 12 ఎపిసోడ్లుగా ‘అన్ స్టాపబుల్’ ప్రసారం కాబోతోందని అంటున్నారు. ఈ షో కోసం బాలయ్య తన స్థాయికి తగ్గట్లే భారీగా పారితోషకం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఎపిసోడ్కు రూ.40 లక్షల చొప్పున.. మొత్తంగా రూ.4.8 కోట్ల మొత్తం రెమ్యూనరేషన్గా బాలయ్య పుచ్చుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
‘అన్ స్టాపబుల్’ ఒక్క సీజన్ కోసం హోస్ట్కే ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఐతే బాలయ్య అందుకుంటున్న ఈ భారీ పారితోషకం ఛారిటీకి వెళ్లబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. ఈ షోకు తనను అడిగినపుడే బాలయ్య ఈ మేరకు నిర్ణయించుకున్నాడని.. షో సందర్భంగా తన పే చెక్ను ఛారిటీకి ఇవ్వబోతున్నట్లు ప్రకటన కూడా చేయబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్యది గొప్ప మనసే అని చెప్పాలి.
ఛారిటీని దృష్టిలో ఉంచుకుని ఆహా వారు కూడా ఉదారంగా పారితోషకం ఇస్తున్నారని.. ఈ విషయాన్ని షో టైంలో ప్రకటించడం ద్వారా జనాల్లో పాజిటివిటీ పెంచి షోకు ఆదరణ పెంచేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఓవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగునివ్వడమే కాక.. వ్యక్తిగతంగా కూడా బాలయ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. కరోనా టైంలో కూడా బాలయ్య చేసిన సేవ ప్రశంసలందుకుంది.
This post was last modified on October 22, 2021 9:31 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…