ఓవైపు వరుస ప్యాన్ ఇండియా సినిమాలకు కమిటవుతూ తన రేంజ్ ఏమిటో గుర్తు చేస్తుంటాడు ప్రభాస్. మరోవైపు మంచితనంతో మనసులు దోచేస్తూ వ్యక్తిగా తాను ఎలాంటివాడో ప్రూవ్ చేస్తుంటాడు. ఇన్నాళ్లూ సౌతిండియన్స్ దగ్గర కాంప్లిమెంట్స్ కొట్టేసిన తను.. ఇప్పుడు నార్త్ వారి ప్రశంసల్లో మునిగి తేలుతున్నాడు.
ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ మూవీ చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు ఈ మూవీ షూట్లోనూ పాల్గొంటున్నాడు. తనని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ ప్రభాస్ని ఆకాశానికి ఎత్తేశాడు. హీరోయిన్ కృతీ సనన్ కూడా ఇటీవల తన పార్ట్ కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడింది. తనలాంటి మంచి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, ఎంతో సింపుల్గా ఉంటాడని, మొదట సిగ్గుపడినా ఓసారి చనువు ఏర్పడ్డాక చాలా కేరింగ్గా, ఎఫెక్షనేట్గా మారిపోతాడని తెగ పొగిడేసింది. ఇప్పుడు కో ఆర్టిస్ట్ సన్నీ సింగ్ కూడా వారేవా ప్రభాస్ అంటున్నాడు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా నటిస్తున్నాడు సన్నీ. ఆన్ స్క్రీన్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ ప్రభాస్ తనకు అన్నయ్యే అంటున్నాడు. ‘అంత కూల్గా ఎలా ఉంటాడో అర్థం కాదు నాకు. ఎప్పుడూ తన దగ్గర రెండు మూడు రకాల ఫుడ్స్ ఉంటాయి. వాటిని అందరికీ పెడతాడు. ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. తనో పెద్ద స్టార్. ఆ విషయం తనకి తెలీదనుకుంటా’ అంటూ ప్రభాస్ ఎంత ఒదిగి ఉంటాడో , ఎలా ప్రేమను పంచుతాడో చెప్పాడు సన్నీ.
ప్రభాస్ని అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. టాలీవుడ్లో అందరికీ ప్రియమైన వ్యక్తి తను. ఇప్పుడు బాలీవుడ్ వారికీ ఫేవరేట్ అయిపోతున్నాడు. దటీజ్ ప్రభాస్ అనిపించుకుంటున్నాడు. అందుకే మరో రెండు రోజుల్లో రానున్న ప్రభాస్ పుట్టినరోజుని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసేందుకు ఇక్కడా, అక్కడా కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on October 22, 2021 9:23 am
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…