ఓవైపు వరుస ప్యాన్ ఇండియా సినిమాలకు కమిటవుతూ తన రేంజ్ ఏమిటో గుర్తు చేస్తుంటాడు ప్రభాస్. మరోవైపు మంచితనంతో మనసులు దోచేస్తూ వ్యక్తిగా తాను ఎలాంటివాడో ప్రూవ్ చేస్తుంటాడు. ఇన్నాళ్లూ సౌతిండియన్స్ దగ్గర కాంప్లిమెంట్స్ కొట్టేసిన తను.. ఇప్పుడు నార్త్ వారి ప్రశంసల్లో మునిగి తేలుతున్నాడు.
ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ మూవీ చేస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు ఈ మూవీ షూట్లోనూ పాల్గొంటున్నాడు. తనని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ ప్రభాస్ని ఆకాశానికి ఎత్తేశాడు. హీరోయిన్ కృతీ సనన్ కూడా ఇటీవల తన పార్ట్ కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడింది. తనలాంటి మంచి వ్యక్తిని ఎక్కడా చూడలేదని, ఎంతో సింపుల్గా ఉంటాడని, మొదట సిగ్గుపడినా ఓసారి చనువు ఏర్పడ్డాక చాలా కేరింగ్గా, ఎఫెక్షనేట్గా మారిపోతాడని తెగ పొగిడేసింది. ఇప్పుడు కో ఆర్టిస్ట్ సన్నీ సింగ్ కూడా వారేవా ప్రభాస్ అంటున్నాడు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా నటిస్తున్నాడు సన్నీ. ఆన్ స్క్రీన్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ ప్రభాస్ తనకు అన్నయ్యే అంటున్నాడు. ‘అంత కూల్గా ఎలా ఉంటాడో అర్థం కాదు నాకు. ఎప్పుడూ తన దగ్గర రెండు మూడు రకాల ఫుడ్స్ ఉంటాయి. వాటిని అందరికీ పెడతాడు. ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. తనో పెద్ద స్టార్. ఆ విషయం తనకి తెలీదనుకుంటా’ అంటూ ప్రభాస్ ఎంత ఒదిగి ఉంటాడో , ఎలా ప్రేమను పంచుతాడో చెప్పాడు సన్నీ.
ప్రభాస్ని అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. టాలీవుడ్లో అందరికీ ప్రియమైన వ్యక్తి తను. ఇప్పుడు బాలీవుడ్ వారికీ ఫేవరేట్ అయిపోతున్నాడు. దటీజ్ ప్రభాస్ అనిపించుకుంటున్నాడు. అందుకే మరో రెండు రోజుల్లో రానున్న ప్రభాస్ పుట్టినరోజుని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసేందుకు ఇక్కడా, అక్కడా కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on October 22, 2021 9:23 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…