నటీనటులకి సినిమాలే కాదు.. యాడ్స్ కూడా క్రేజ్ని, ఇన్కమ్ని తెచ్చి పెడతాయి. తమకిష్టమైన స్టార్ చెప్పాడని ఆ బ్రాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే పెద్ద కంపెనీలన్నీ ఫిల్మ్ యాక్టర్స్కి లక్షలు చెల్లించి తమ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయించుకుంటాయి. అయితే ఒక్కోసారి ఇది ఆయా యాక్టర్ల ఇమేజ్ని దెబ్బ తీయడమూ జరుగుతుంది. ఇప్పుడు రెజీనా విషయంలోనూ అదే జరుగుతోంది.
రీసెంట్గా ఇన్స్టాలో ఒక ఫొటోని పోస్ట్ చేసింది రెజీనా. అందులో ఆమె చేతిలో మందు గ్లాస్ ఉంది. సిగ్నేచర్ విస్కీ యాడ్ ఇది. ‘తొమ్మిదేళ్లప్పుడు యాంకరింగ్ మొదలెట్టాను. ఇప్పుడు సినిమాలు, యాడ్స్ చేసే స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ క్షణాల్ని నేను సిగ్నేచర్తో సెలెబ్రేట్ చేసుకుంటాను’ అని రెజీనా చెప్పింది. అంతే.. ఆ క్షణం నుంచి ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తావా అని ఒకరు ప్రశ్నిస్తే.. మీరిలా ఆల్కహాల్ని ప్రమోట్ చేయడం చూస్తుంటే సిగ్గేస్తోంది, మిమ్మల్ని అన్ఫాలో చేస్తున్నా అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.
సినిమావాళ్ల మీద జనాలకి ఒక అడ్మిరేషన్ ఉంటుంది. తమ ఫేవరేట్ స్టార్స్ తప్పుల్ని ప్రోత్సహిస్తే వాళ్లు తట్టుకోలేరు. పాన్ మసాలా యాడ్ చేసినందుకు మహేష్బాబు లాంటి వాడినే వదిలి పెట్టలేదు జనం. టాలీవుడ్ స్టార్స్లో మహేష్ చేతిలో ఉన్నన్ని ఎండార్స్మెంట్స్ ఎవరి చేతిలోనూ లేవు. అయితే వేటితోనూ రాని సమస్య పాన్ మసాలా యాడ్తో వచ్చింది. అంత పెద్ద స్టార్ ఓ పుగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేయడమేంటి, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
రీసెంట్గా అమితాబ్ కూడా ఓ టొబాకో బ్రాండ్ యాడ్లో నటిస్తే అలా చేయొద్దంటూ ఫ్యాన్స్ కోరారు. చివరికి నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ కూడా కోరడంతో ఆయన ఎండార్స్మెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇంకెప్పుడూ ఇలాంటి యాడ్స్లో నటించనని చెప్పేశారు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ కూడా యాడ్స్కి దూరంగా ఉండటానికి కారణం తప్పుడు ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయకూడదనే. కాబట్టి సిగరెట్స్, ఆల్కహాల్, గుట్కా లాంటి హానికారక పదార్థాలను సెలెబ్రిటీస్ ప్రమోట్ చేయకపోవడమే మంచిది
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…