అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఇదే డైరెక్టర్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. వీటితో పాటు కొన్ని కథలు కూడా వింటున్నాడు. తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే చైతు సినిమా మొదలవుతుందట. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు. ఆ తరువాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.
అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కూడా చైతు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు కథ సెట్ అవ్వలేదు. మరోపక్క నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు చైతు. నిజానికి నందిని రెడ్డి చాలా కాలం క్రితమే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంది. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని తెలుస్తోంది.
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…