అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఇదే డైరెక్టర్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. వీటితో పాటు కొన్ని కథలు కూడా వింటున్నాడు. తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే చైతు సినిమా మొదలవుతుందట. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు. ఆ తరువాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.
అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కూడా చైతు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు కథ సెట్ అవ్వలేదు. మరోపక్క నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు చైతు. నిజానికి నందిని రెడ్డి చాలా కాలం క్రితమే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంది. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on October 21, 2021 2:20 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…