అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఇదే డైరెక్టర్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. వీటితో పాటు కొన్ని కథలు కూడా వింటున్నాడు. తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే చైతు సినిమా మొదలవుతుందట. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు. ఆ తరువాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.
అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కూడా చైతు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు కథ సెట్ అవ్వలేదు. మరోపక్క నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు చైతు. నిజానికి నందిని రెడ్డి చాలా కాలం క్రితమే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంది. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on October 21, 2021 2:20 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…