అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఇదే డైరెక్టర్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. వీటితో పాటు కొన్ని కథలు కూడా వింటున్నాడు. తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే చైతు సినిమా మొదలవుతుందట. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు. ఆ తరువాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.
అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కూడా చైతు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు కథ సెట్ అవ్వలేదు. మరోపక్క నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు చైతు. నిజానికి నందిని రెడ్డి చాలా కాలం క్రితమే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంది. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on October 21, 2021 2:20 pm
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…