ఒకప్పుడు తెలుగు సినిమాలకు యుఎస్లో మిలియన్ డాలర్ల వసూళ్లనేవి కేక్ వాక్ లాగే ఉండేది. కొంచెం క్లాస్ టచ్ ఉండి, మంచి టాక్ వస్తే.. చిన్న సినిమాలు సైతం ఈజీగా మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోయేవి. అక్కడ తెలుగు సినిమాల దూకుడు చూసి వేరే భాషా చిత్రాల బయ్యర్లు ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి. అర్జున్ రెడ్డి, ఫిదా, అఆ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం. ఐతే కరోనా రాకముందు వరకు తెలుగు సినిమాలకు యుఎస్లో ఎదురే లేదు.
కానీ వైరస్ పుణ్యమా అని మిగతా చిత్రాల్లాగే తెలుగు సినిమాలూ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తిన్నాయి. యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి టైం పట్టింది. ఐతే ఇక్కడ కూడా మిగతా భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు దూకుడు చూపించాయి.
కరోనా బ్రేక్ తర్వాత జాతిరత్నాలు హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ కూడా ఆ మార్కును దాటింది. మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. ఈ మధ్యే ‘లవ్ స్టోరి’ కరోనా విరామం తర్వాత అన్ని తెలుగు చిత్రాల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఆ సినిమా అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
ఇప్పుడు మరో అక్కినేని కుర్రాడు కూడా యుఎస్ బాక్సాఫీస్లో జోరు చూపిస్తున్నాడు. దసరా కానుకగా విడుదలైన అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా బ్రేక్ తర్వాత హాఫ్ మిలియన్ మార్కును దాటిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా బుధవారం అర మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. వీకెండ్ అయ్యేసరికే 4.5 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. మొత్తానికి హాఫ్ మిలియన్ క్లబ్బులోకి చేరింది.
This post was last modified on October 21, 2021 10:51 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…