ఒకప్పుడు తెలుగు సినిమాలకు యుఎస్లో మిలియన్ డాలర్ల వసూళ్లనేవి కేక్ వాక్ లాగే ఉండేది. కొంచెం క్లాస్ టచ్ ఉండి, మంచి టాక్ వస్తే.. చిన్న సినిమాలు సైతం ఈజీగా మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోయేవి. అక్కడ తెలుగు సినిమాల దూకుడు చూసి వేరే భాషా చిత్రాల బయ్యర్లు ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి. అర్జున్ రెడ్డి, ఫిదా, అఆ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం. ఐతే కరోనా రాకముందు వరకు తెలుగు సినిమాలకు యుఎస్లో ఎదురే లేదు.
కానీ వైరస్ పుణ్యమా అని మిగతా చిత్రాల్లాగే తెలుగు సినిమాలూ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తిన్నాయి. యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి టైం పట్టింది. ఐతే ఇక్కడ కూడా మిగతా భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు దూకుడు చూపించాయి.
కరోనా బ్రేక్ తర్వాత జాతిరత్నాలు హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ కూడా ఆ మార్కును దాటింది. మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. ఈ మధ్యే ‘లవ్ స్టోరి’ కరోనా విరామం తర్వాత అన్ని తెలుగు చిత్రాల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఆ సినిమా అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
ఇప్పుడు మరో అక్కినేని కుర్రాడు కూడా యుఎస్ బాక్సాఫీస్లో జోరు చూపిస్తున్నాడు. దసరా కానుకగా విడుదలైన అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా బ్రేక్ తర్వాత హాఫ్ మిలియన్ మార్కును దాటిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా బుధవారం అర మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. వీకెండ్ అయ్యేసరికే 4.5 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. మొత్తానికి హాఫ్ మిలియన్ క్లబ్బులోకి చేరింది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…