ఒకప్పుడు తెలుగు సినిమాలకు యుఎస్లో మిలియన్ డాలర్ల వసూళ్లనేవి కేక్ వాక్ లాగే ఉండేది. కొంచెం క్లాస్ టచ్ ఉండి, మంచి టాక్ వస్తే.. చిన్న సినిమాలు సైతం ఈజీగా మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోయేవి. అక్కడ తెలుగు సినిమాల దూకుడు చూసి వేరే భాషా చిత్రాల బయ్యర్లు ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి. అర్జున్ రెడ్డి, ఫిదా, అఆ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం. ఐతే కరోనా రాకముందు వరకు తెలుగు సినిమాలకు యుఎస్లో ఎదురే లేదు.
కానీ వైరస్ పుణ్యమా అని మిగతా చిత్రాల్లాగే తెలుగు సినిమాలూ అక్కడ గట్టి ఎదురు దెబ్బ తిన్నాయి. యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది. మళ్లీ పుంజుకోవడానికి టైం పట్టింది. ఐతే ఇక్కడ కూడా మిగతా భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు దూకుడు చూపించాయి.
కరోనా బ్రేక్ తర్వాత జాతిరత్నాలు హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ కూడా ఆ మార్కును దాటింది. మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. ఈ మధ్యే ‘లవ్ స్టోరి’ కరోనా విరామం తర్వాత అన్ని తెలుగు చిత్రాల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఆ సినిమా అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
ఇప్పుడు మరో అక్కినేని కుర్రాడు కూడా యుఎస్ బాక్సాఫీస్లో జోరు చూపిస్తున్నాడు. దసరా కానుకగా విడుదలైన అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా బ్రేక్ తర్వాత హాఫ్ మిలియన్ మార్కును దాటిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా బుధవారం అర మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. వీకెండ్ అయ్యేసరికే 4.5 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. మొత్తానికి హాఫ్ మిలియన్ క్లబ్బులోకి చేరింది.
This post was last modified on October 21, 2021 10:51 am
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…