సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి దశాబ్దం కిందట్నుంచి చర్చ జరుగుతోంది. ఆమె శింబును పెళ్లి చేసుకుంటుందని ముందు వార్తలొచ్చాయి. తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆపై ప్రభుదేవా ప్రేమలో పడి అతడితో పెళ్లి వరకు వెళ్లింది.
ఇందుకోసం సినిమాలు కూడా వదిలేయడానికి సిద్ధమైంది. కానీ అతడితోనూ బంధం తెగింది. ఆపై సీరియస్గా సినిమాల్లో మునిగిపోయిన నయన్.. కొన్నేళ్ల కిందటే తాను హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీదా సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ మంచి అండర్ స్టాండింగ్తో సాగుతున్నారు. నాలుగేళ్లకు పైగా వీరి ప్రేమాయణం సాగుతోంది. విఘ్నేష్తో జీవితాంతం బంధంలో ఉండటానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది నయన్.
వీరి పెళ్లి గురించి రెండేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోతోంది. ఐతే ఎట్టకేలకు నయన్, విఘ్నేష్ పెళ్లికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఇద్దరూ లైమ్ లైట్లో ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు. పెళ్లిని కూడా ఆడంబరంగా చేసుకోవాలనుకునే తరహా కాదు. పైగా వారికి లాక్ డౌన్ కలిసొస్తోంది. అందుకే ఈ టైంలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారట.
త్వరలోనే ఓ గుడిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. పెళ్లి గురించి అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు లేవని.. సింపుల్గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇస్తారని కూడా అంటున్నారు. మరి ఈసారైనా నయన్ పెళ్లి వార్త నిజమవుతుందేమో చూడాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…