సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి దశాబ్దం కిందట్నుంచి చర్చ జరుగుతోంది. ఆమె శింబును పెళ్లి చేసుకుంటుందని ముందు వార్తలొచ్చాయి. తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆపై ప్రభుదేవా ప్రేమలో పడి అతడితో పెళ్లి వరకు వెళ్లింది.
ఇందుకోసం సినిమాలు కూడా వదిలేయడానికి సిద్ధమైంది. కానీ అతడితోనూ బంధం తెగింది. ఆపై సీరియస్గా సినిమాల్లో మునిగిపోయిన నయన్.. కొన్నేళ్ల కిందటే తాను హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీదా సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ మంచి అండర్ స్టాండింగ్తో సాగుతున్నారు. నాలుగేళ్లకు పైగా వీరి ప్రేమాయణం సాగుతోంది. విఘ్నేష్తో జీవితాంతం బంధంలో ఉండటానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది నయన్.
వీరి పెళ్లి గురించి రెండేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోతోంది. ఐతే ఎట్టకేలకు నయన్, విఘ్నేష్ పెళ్లికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఇద్దరూ లైమ్ లైట్లో ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు. పెళ్లిని కూడా ఆడంబరంగా చేసుకోవాలనుకునే తరహా కాదు. పైగా వారికి లాక్ డౌన్ కలిసొస్తోంది. అందుకే ఈ టైంలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారట.
త్వరలోనే ఓ గుడిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. పెళ్లి గురించి అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు లేవని.. సింపుల్గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇస్తారని కూడా అంటున్నారు. మరి ఈసారైనా నయన్ పెళ్లి వార్త నిజమవుతుందేమో చూడాలి.
This post was last modified on June 3, 2020 7:47 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…