ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోను నడిపించబోతున్నారు. ఇన్నేళ్లలో టీవీ కార్యక్రమాలకు అతిథిగా వెళ్లాడు తప్ప.. తనే హోస్టుగా మారి ఏ షోనూ నడిపించలేదు ఈ నందమూరి హీరో. అలాంటిది ఆహా ఓటీటీ కోసం బాలయ్య హోస్ట్ బాధ్యతలు చేపట్టడం అందరికీ పెద్ద షాకే.
బాలయ్య ఇలా హోస్ట్ కావడమే ఆశ్చర్యం అంటే.. నందమూరి వారికి శత్రు వర్గంగా భావించే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ నేతృత్వంలో నడిచే ఓటీటీ కోసం ఈ షో చేయడం ఇంకా షాకిచ్చే విషయం. ఈ షో కోసం బాలయ్యను అరవింద్ అడగడమూ చిత్రమే.
ఐతే ఇద్దరూ వేరే విషయాలేవీ ఆలోచించకుండా ఈ షో విషయంలో అంగీకారానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మరి అన్ స్టాపబుల్ పేరుతో రానున్న ఈ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.
ఆహా వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఒక్కో ఎపిసోడ్కు రూ.40 లక్షల చొప్పున పారితోషకంగా పుచ్చుకోనున్నాడట. ఈ షో తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. అంటే ఈ లెక్కన మొత్తంగా బాలయ్య రూ.4.8 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్నమాట. ఆయన మార్కెట్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగానే అల్లు వారు పారితోషకం ఇస్తున్నట్లన్నమాట.
బాలయ్య పారితోషకానికే దాదాపు ఐదు కోట్లు అయిపోతే.. షో కోసం మొత్తంగా ఎంత ఖర్చు పెడతారో.. ఇంత బడ్జెట్ పెట్టడం వల్ల ఆహాకు ఒనగూరే ఆర్థిక ప్రయోజనం ఎంతో చూడాలి. ఆహా వైపు సబ్స్క్రైబర్లను మరింతగా ఆకర్షించడానికి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పేరున్న చిత్రాల స్ట్రీమింగ్ హక్కులు తీసుకోవడమే కాక.. వెబ్ సిరీస్లు కూడా బాగానే నిర్మిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులేస్తున్న నేపథ్యంలోనే బాలయ్యతో ఈ మెగా షోకు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…