ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షోను నడిపించబోతున్నారు. ఇన్నేళ్లలో టీవీ కార్యక్రమాలకు అతిథిగా వెళ్లాడు తప్ప.. తనే హోస్టుగా మారి ఏ షోనూ నడిపించలేదు ఈ నందమూరి హీరో. అలాంటిది ఆహా ఓటీటీ కోసం బాలయ్య హోస్ట్ బాధ్యతలు చేపట్టడం అందరికీ పెద్ద షాకే.
బాలయ్య ఇలా హోస్ట్ కావడమే ఆశ్చర్యం అంటే.. నందమూరి వారికి శత్రు వర్గంగా భావించే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ నేతృత్వంలో నడిచే ఓటీటీ కోసం ఈ షో చేయడం ఇంకా షాకిచ్చే విషయం. ఈ షో కోసం బాలయ్యను అరవింద్ అడగడమూ చిత్రమే.
ఐతే ఇద్దరూ వేరే విషయాలేవీ ఆలోచించకుండా ఈ షో విషయంలో అంగీకారానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మరి అన్ స్టాపబుల్ పేరుతో రానున్న ఈ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.
ఆహా వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఒక్కో ఎపిసోడ్కు రూ.40 లక్షల చొప్పున పారితోషకంగా పుచ్చుకోనున్నాడట. ఈ షో తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. అంటే ఈ లెక్కన మొత్తంగా బాలయ్య రూ.4.8 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడన్నమాట. ఆయన మార్కెట్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగానే అల్లు వారు పారితోషకం ఇస్తున్నట్లన్నమాట.
బాలయ్య పారితోషకానికే దాదాపు ఐదు కోట్లు అయిపోతే.. షో కోసం మొత్తంగా ఎంత ఖర్చు పెడతారో.. ఇంత బడ్జెట్ పెట్టడం వల్ల ఆహాకు ఒనగూరే ఆర్థిక ప్రయోజనం ఎంతో చూడాలి. ఆహా వైపు సబ్స్క్రైబర్లను మరింతగా ఆకర్షించడానికి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పేరున్న చిత్రాల స్ట్రీమింగ్ హక్కులు తీసుకోవడమే కాక.. వెబ్ సిరీస్లు కూడా బాగానే నిర్మిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులేస్తున్న నేపథ్యంలోనే బాలయ్యతో ఈ మెగా షోకు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on October 17, 2021 10:41 am
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…