టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ‘స్వామి రారా’ ఒకటి. తెలుగులో రామ్ గోపాల్ వర్మ మినహా క్రైమ్ కామెడీ తీసిన దర్శకులు చాలా తక్కువ. అందులోనూ వర్మ చిత్రాల తర్వాత ఆ జానర్లో సినిమాలు మరీ తగ్గిపోయాయి. అలాంటి టైంలో ఆర్జీవీ సినిమాలతో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో ‘స్వామి రారా’ అనే మంచి క్రైమ్ కామెడీ మూవీ తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు సుధీర్ వర్మ.
2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయమే సాధించింది. ఒడుదొడుకులతో సాగుతున్న నిఖిల్ కెరీర్ను ట్రాక్లో పెట్టిన సినిమా ఇది. అక్కడి నుంచి మంచి చిత్రాలను ఎంచుకుంటూ విభిన్న ప్రయాణం చేస్తున్నాడు నిఖిల్. ‘స్వామి రారా’ తర్వాత సుధీర్తో మళ్లీ ‘కేశవ’ అనే సినిమా చేశాడు నిఖిల్. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇది మాత్రమే కాదు.. ‘స్వామి రారా’ తర్వాత సుధీర్ తీసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు.
ఐతే ఈ మధ్యే కొరియన్ మూవీ ఆధారంగా ‘సురేష్ ప్రొడక్షన్స్’లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టిన సుధీర్.. అది సెట్స్ మీద ఉండగానే కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అందులో హీరో నిఖిల్ కావడం విశేషం. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయ్యాక సుధీర్ ఈ సినిమాను మొదలుపెడతాడు. ఈలోపు నిఖిల్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తాడు. అతను ఇప్పటికే కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అవి ముగింపు దశలో ఉన్నాయి. ఈ మధ్యే ఒక కొత్త చిత్రాన్ని నిఖిల్ మొదలుపెట్టాడు. అదయ్యాక సుధీర్ సినిమా మీదికి వెళ్తాడు. మరి ‘కేశవ’ లాగా కాకుండా ఈసారి ‘స్వామి రారా’ లాంటి హిట్ను వీళ్లిద్దరూ డెలివర్ చేస్తారేమో చూద్దాం.
This post was last modified on October 16, 2021 10:47 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…