సూపర్ స్టార్ రజినీకాంత్ చివరగా కొట్టిన హిట్ ఏదో చెప్పమంటే ఆయన అభిమానులు కూడా తడబడతారు. ‘కబాలి’, ‘2.0’ లాంటి చిత్రాలకు భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. అవి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. బయ్యర్లకూ సంతోషాన్ని మిగల్చలేదు. గత కొన్నేళ్లలో ఆయన చేసిన మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరిగ్గా చెప్పాలంటే ‘రోబో’ తర్వత ఆయనకు నిఖార్సయిన హిట్టే దక్కలేదు. సినిమా సినిమాకూ తన రేంజ్ తగ్గించుకుంటూ, మార్కెట్ను దెబ్బ తీసుకుంటూ కెరీర్లో ఎన్నడూ లేని తక్కువ రేంజికి పడిపోయాడు.
విజయ్, అజిత్ లాంటి హీరోలు తమిళంలో రజినీని దాటి ముందుకెళ్లిపోయారు. ఇక తెలుగులో అయితే రజినీ మార్కెట్ మామూలుగా పడిపోలేదు. పదేళ్ల కిందటే 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఆయన చిత్రాలకు ఇప్పుడు పది కోట్లకు ఇటు ఇటుగా రేటు పలుకుతోంది.
ఇలాంటి సమయంలో రజినీ తమిళంలో ‘అన్నాత్తె’ సినిమా చేశాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ మూవీస్ సునీల్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ‘అన్నాత్తె’ అని పేరు కూడా ఖరారైంది తెలుగులో ఈ చిత్రానికి. నిన్ననే తమిళంలో టీజర్ రిలీజ్ చేశారు. అది చూస్తే రజినీ చాన్నాళ్లకు మంచి హిట్ కొట్టబోతున్నాడేమో.. ఆయన కరువు తీరబోతోందేమో అనిపిస్తోంది. నిజానికి ఈ టీజర్లో కొత్తగా ఏమీ లేదు. హీరో ఎలివేషన్లు, పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, భారీతనమే కనిపించింది.
ఐతే దర్శకుడు శివ రొటీన్ కథలనే మాస్ మెచ్చేలా చెప్పడంలో సిద్ధహస్తుడు. ఎమోషన్లు, సెంటిమెంట్, హీరో ఎలివేషన్లు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే తమిళంలో వీరం, వేదాళం, విశ్వాసం.. ఇలాంటి బ్లాక్బస్టర్లు వచ్చాయి. ఒక్క ‘వివేగం’ మాత్రమే తమిళంలో అతను తీసిన సినిమాల్లో నిరాశ పరిచింది. దాని తర్వాత ‘విశ్వాసం’తో భారీ విజయాన్నందుకున్నాడు. ఈసారి కూడా మసాలాలన్నీ సరిగ్గా కలిపి మాస్కు మెచ్చేలా యాక్షన్ ఘట్టాలతో సినిమాను తీర్చిదిద్దినట్లున్నాడు. రజినీ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి టీజర్లో. దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుని రజినీకి పెద్ద హిట్ ఇస్తుందనిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో?
This post was last modified on October 15, 2021 5:32 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…