మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పుడు ఇండస్ట్రీలో కాంపిటిషన్ ఉన్నప్పటికీ తమన్నాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ ఎన్నడూ లేనంత బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. ఇండస్ట్రీలో కొత్తగా వస్తోన్న హీరోయిన్లు కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాస్త పేరున్న వారంతా రెండు కోట్లకు పైగానే అందుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం కోటిన్నర దగ్గరే ఆగిపోయింది.
దీంతో ఆమె తన రెమ్యునరేషన్ పెంచుకునే విషయంలో కొత్త ట్రిక్ ప్లే చేసింది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే తమన్నాకు సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి తమన్నా ముందుకొస్తుంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే డిమాండ్ చేస్తుంది. అరవై ప్లస్ యాక్టర్లతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదు. బాలకృష్ణ, చిరు లాంటి స్టార్స్ కు హీరోయిన్ ను వెతకడం పెద్ద టాస్క్ అయిపోయింది.
ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది తమన్నా. సీనియర్ హీరోలతో నటించే సినిమాలకు రెమ్యునరేషన్ పెంచి చెబుతోందట తమన్నా. నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో.. ఆమె అడిగినంత ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నా.. వెంకీ సరసన ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది. అలానే చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో రానున్న ‘భోళా శంకర్’ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలకు తమన్నా భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 15, 2021 5:17 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…