మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పుడు ఇండస్ట్రీలో కాంపిటిషన్ ఉన్నప్పటికీ తమన్నాకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ ఎన్నడూ లేనంత బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. ఇండస్ట్రీలో కొత్తగా వస్తోన్న హీరోయిన్లు కూడా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాస్త పేరున్న వారంతా రెండు కోట్లకు పైగానే అందుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం కోటిన్నర దగ్గరే ఆగిపోయింది.
దీంతో ఆమె తన రెమ్యునరేషన్ పెంచుకునే విషయంలో కొత్త ట్రిక్ ప్లే చేసింది. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే తమన్నాకు సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి తమన్నా ముందుకొస్తుంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం బాగానే డిమాండ్ చేస్తుంది. అరవై ప్లస్ యాక్టర్లతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదు. బాలకృష్ణ, చిరు లాంటి స్టార్స్ కు హీరోయిన్ ను వెతకడం పెద్ద టాస్క్ అయిపోయింది.
ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది తమన్నా. సీనియర్ హీరోలతో నటించే సినిమాలకు రెమ్యునరేషన్ పెంచి చెబుతోందట తమన్నా. నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో.. ఆమె అడిగినంత ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్నా.. వెంకీ సరసన ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోంది. అలానే చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో రానున్న ‘భోళా శంకర్’ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలకు తమన్నా భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 15, 2021 5:17 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…