గదార్ః ఏక్ ప్రేమ్ కథ. భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఈ సినిమా రిలీజైంది. అప్పటి భారతీయ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది గదార్. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ ఈ చారిత్రక చిత్రాన్ని తీర్చిదిద్దాడు.
1947లో దేశ విభజన సందర్భంగా అనుకోకుండా పాకిస్థాన్కు చేరిన భార్యా పిల్లల కోసం అక్కడి వెళ్లి పోరాడి వారిని వెనక్కి తీసుకొచ్చే యోధుడి కథ ఇది. ఇందులోని ఎమోషన్లు, యాక్షన్ ఘట్టాలు అప్పటి ప్రేక్షకులను కట్టిపడేశాయి. సన్నీ డియోల్, అమీషాల కెరీర్లలో ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాగా గదార్ నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యలో అవి ఆగిపోయి.. ఇప్పుడు మళ్లీ పురుడు పోసుకున్నాయి.
గదార్ సీక్వెల్ను తాజాగా అధికారికంగా ప్రకటించేశారు కూడా. అనిల్ శర్మనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. సన్నీడియోల్, అమీషా పటేల్ సీక్వెల్లోనూ నటించనున్నారు. కొత్త నటీనటులెవరైనా యాడ్ అవుతారేమో తెలియదు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్లిద్దరితో గదార్ సీక్వెల్ ఏమేర వర్కవుట్ అవుతుందన్నదే సందేహంగా ఉంది.
2001 సమయానికి అమీషా యవ్వనంలో, కథానాయికగా మంచి ఊపులో ఉంది. సన్నీడియోల్ కూడా ఫాంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఔట్ డేటెడ్ అయిపోయారనే చెప్పాలి. అమీషా దాదాపుగా సినిమాలకు దూరం అయిపోయింది. సన్నీ నామమాత్రంగా కొనసాగుతున్నాడు. గదార్ తర్వాత అనిల్ శర్మ అంచనాలు అందుకోలేకపోయాడు. ఒక్క హిట్ మూవీ కూడా తీయలేకపోయాడు. ఈ కాంబినేషన్లో, ఈ పరిస్థితుల్లో గదార్ సీక్వెల్ ఏమంత మంచి ఆలోచన కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on October 15, 2021 11:05 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…