గదార్ః ఏక్ ప్రేమ్ కథ. భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఈ సినిమా రిలీజైంది. అప్పటి భారతీయ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది గదార్. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ ఈ చారిత్రక చిత్రాన్ని తీర్చిదిద్దాడు.
1947లో దేశ విభజన సందర్భంగా అనుకోకుండా పాకిస్థాన్కు చేరిన భార్యా పిల్లల కోసం అక్కడి వెళ్లి పోరాడి వారిని వెనక్కి తీసుకొచ్చే యోధుడి కథ ఇది. ఇందులోని ఎమోషన్లు, యాక్షన్ ఘట్టాలు అప్పటి ప్రేక్షకులను కట్టిపడేశాయి. సన్నీ డియోల్, అమీషాల కెరీర్లలో ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాగా గదార్ నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యలో అవి ఆగిపోయి.. ఇప్పుడు మళ్లీ పురుడు పోసుకున్నాయి.
గదార్ సీక్వెల్ను తాజాగా అధికారికంగా ప్రకటించేశారు కూడా. అనిల్ శర్మనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. సన్నీడియోల్, అమీషా పటేల్ సీక్వెల్లోనూ నటించనున్నారు. కొత్త నటీనటులెవరైనా యాడ్ అవుతారేమో తెలియదు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్లిద్దరితో గదార్ సీక్వెల్ ఏమేర వర్కవుట్ అవుతుందన్నదే సందేహంగా ఉంది.
2001 సమయానికి అమీషా యవ్వనంలో, కథానాయికగా మంచి ఊపులో ఉంది. సన్నీడియోల్ కూడా ఫాంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఔట్ డేటెడ్ అయిపోయారనే చెప్పాలి. అమీషా దాదాపుగా సినిమాలకు దూరం అయిపోయింది. సన్నీ నామమాత్రంగా కొనసాగుతున్నాడు. గదార్ తర్వాత అనిల్ శర్మ అంచనాలు అందుకోలేకపోయాడు. ఒక్క హిట్ మూవీ కూడా తీయలేకపోయాడు. ఈ కాంబినేషన్లో, ఈ పరిస్థితుల్లో గదార్ సీక్వెల్ ఏమంత మంచి ఆలోచన కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on October 15, 2021 11:05 am
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…