Movie News

ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెలా?


గ‌దార్ః ఏక్ ప్రేమ్ క‌థ‌. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో ఇదొక‌టి. స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల కింద‌ట ఈ సినిమా రిలీజైంది. అప్ప‌టి భార‌తీయ సినిమా వ‌సూళ్ల రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొట్టేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది గ‌దార్. స‌న్నీ డియోల్, అమీషా ప‌టేల్ జంట‌గా అనిల్ శ‌ర్మ ఈ చారిత్ర‌క చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

1947లో దేశ విభ‌జ‌న సంద‌ర్భంగా అనుకోకుండా పాకిస్థాన్‌కు చేరిన భార్యా పిల్ల‌ల కోసం అక్క‌డి వెళ్లి పోరాడి వారిని వెన‌క్కి తీసుకొచ్చే యోధుడి క‌థ ఇది. ఇందులోని ఎమోష‌న్లు, యాక్ష‌న్ ఘ‌ట్టాలు అప్ప‌టి ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాయి. స‌న్నీ డియోల్, అమీషాల కెరీర్ల‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ సినిమాగా గ‌దార్ నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయ‌డానికి ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌ధ్య‌లో అవి ఆగిపోయి.. ఇప్పుడు మ‌ళ్లీ పురుడు పోసుకున్నాయి.

గ‌దార్ సీక్వెల్‌ను తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించేశారు కూడా. అనిల్ శ‌ర్మ‌నే ఈ చిత్రాన్ని కూడా రూపొందించ‌నున్నాడు. స‌న్నీడియోల్, అమీషా పటేల్ సీక్వెల్లోనూ న‌టించ‌నున్నారు. కొత్త న‌టీన‌టులెవ‌రైనా యాడ్ అవుతారేమో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వీళ్లిద్ద‌రితో గ‌దార్ సీక్వెల్ ఏమేర వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న‌దే సందేహంగా ఉంది.

2001 స‌మ‌యానికి అమీషా య‌వ్వ‌నంలో, క‌థానాయిక‌గా మంచి ఊపులో ఉంది. స‌న్నీడియోల్ కూడా ఫాంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ఔట్ డేటెడ్ అయిపోయార‌నే చెప్పాలి. అమీషా దాదాపుగా సినిమాల‌కు దూరం అయిపోయింది. సన్నీ నామ‌మాత్రంగా కొన‌సాగుతున్నాడు. గ‌దార్ త‌ర్వాత‌ అనిల్ శ‌ర్మ అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. ఒక్క హిట్ మూవీ కూడా తీయ‌లేక‌పోయాడు. ఈ కాంబినేష‌న్లో, ఈ ప‌రిస్థితుల్లో గ‌దార్ సీక్వెల్ ఏమంత మంచి ఆలోచ‌న కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on October 15, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

7 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

25 minutes ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

49 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

55 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

1 hour ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago