ఒకప్పుడు స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకి కమిటయ్యేవారు. కానీ ఇప్పుడు ఒక మూవీ సెట్స్పై ఉండగానే నెక్స్ట్ చేయడానికి ఒకట్రెండు ప్రాజెక్టుల్ని సెట్ చేసి పెట్టేసుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా ఇప్పుడు అదే చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ చివరి దశకు వచ్చేవరకు రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలేవీ బైటికి చెప్పలేదు. కానీ సడెన్గా శంకర్తో సినిమాని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఆ సినిమా ఇంకా సెట్స్కి వెళ్లకముందే దసరా సందర్భంగా గౌతమ్ తిన్ననూరితో మూవీ ప్రకటించి స్వీట్ న్యూస్ చెప్పాడు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
‘మళ్లీరావా’తో ప్రేమలోని ఎమోషన్ని హార్ట్ టచింగ్గా చెప్పిన గౌతమ్ తిన్ననూరి.. ‘జెర్సీ’ చిత్రంతో హ్యూమన్ లైఫ్లోని అన్ని ఎమోషన్స్ని ఎంత బాగా ఆవిష్కరించగలడో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. ఇక ‘రంగస్థలం’తో తనలోని ఎమోషనల్ కోణాన్ని బయటికి తీశాడు రామ్ చరణ్. వీరిద్దరూ కలిస్తే ఓ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. కాకపోతే గౌతమ్ ఈసారి కూడా అదే జానర్ని ఎంచుకున్నాడో లేక చెర్రీ కోసం ఏదైనా కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేశాడో చూడాలి.
This post was last modified on October 15, 2021 10:35 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…