దసరా కానుకగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘మహాసముద్రం’. ఈ సినిమా కథను దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ కంటే ముందే రాసుకున్నాడట. ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్బస్టర్ కావడంతో వెంటనే ఈ సినిమానే తెరకెక్కించాలనుకున్నాడు. కానీ దీనికి తగ్గ కాస్టింగ్ కుదరకపోవడం వల్ల సినిమా ఆలస్యమైంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా ముందు సిద్దార్థ్ను ఫిక్స్ చేసుకోవడంతో అతడితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి కొందరు హీరోలు ముందుకు రాలేదన్నది దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన మాట. చివరికి శర్వానంద్ ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ సినిమాలో ఓ కథానాయికగా అదితి రావును చాలా ముందుగానే ఖరారు చేసుకున్నాడు అజయ్. సినిమా మొదలు కావడంలో ఆలస్యమైనప్పటికీ ఆమెతోనే ఈ పాత్ర చేయించాలని పట్టుబట్టి కూర్చున్నట్లు కూడా అజయ్ చెప్పడం తెలిసిందే.
ఐతే అదితి చేసిన మహా పాత్రకు కూడా ముందు అనుకున్నది ఆమెను కాదట. సమంతకు ఈ కథ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చిందని.. ఆమెకు ఈ పాత్ర బాగానే సూటయ్యేదని.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయిందని అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐతే కథానాయికకు మంచి ప్రాధాన్యమున్నట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాను సమంత ఎందుకు చేయలేకపోయిందన్నది ఆసక్తికరం.
బహుశా అప్పటికే ఈ సినిమాలో ఓ హీరోగా సిద్ధు ఫిక్స్ అయి ఉండటం వల్ల.. అతడితో ఒకప్పటి బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను సమంత ఒప్పుకోక పోయి ఉండొచ్చని భావించవచ్చు. కెరీర్ ఆరంభంలో సిద్ధుతో సమంత కొంతకాలం రిలేషన్షిప్లో ఉండటం, తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం తెలిసిందే. ఇటీవల నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోబోతున్నపుడు సమంతను ఉద్దేశించినట్లుగా సిద్ధు చేసిన ఒక ట్వీట్ వైరల్ కావడం తెలిసిందే.
This post was last modified on October 13, 2021 7:39 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…