దసరా కానుకగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘మహాసముద్రం’. ఈ సినిమా కథను దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ కంటే ముందే రాసుకున్నాడట. ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్బస్టర్ కావడంతో వెంటనే ఈ సినిమానే తెరకెక్కించాలనుకున్నాడు. కానీ దీనికి తగ్గ కాస్టింగ్ కుదరకపోవడం వల్ల సినిమా ఆలస్యమైంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా ముందు సిద్దార్థ్ను ఫిక్స్ చేసుకోవడంతో అతడితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి కొందరు హీరోలు ముందుకు రాలేదన్నది దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన మాట. చివరికి శర్వానంద్ ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ సినిమాలో ఓ కథానాయికగా అదితి రావును చాలా ముందుగానే ఖరారు చేసుకున్నాడు అజయ్. సినిమా మొదలు కావడంలో ఆలస్యమైనప్పటికీ ఆమెతోనే ఈ పాత్ర చేయించాలని పట్టుబట్టి కూర్చున్నట్లు కూడా అజయ్ చెప్పడం తెలిసిందే.
ఐతే అదితి చేసిన మహా పాత్రకు కూడా ముందు అనుకున్నది ఆమెను కాదట. సమంతకు ఈ కథ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చిందని.. ఆమెకు ఈ పాత్ర బాగానే సూటయ్యేదని.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయిందని అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐతే కథానాయికకు మంచి ప్రాధాన్యమున్నట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాను సమంత ఎందుకు చేయలేకపోయిందన్నది ఆసక్తికరం.
బహుశా అప్పటికే ఈ సినిమాలో ఓ హీరోగా సిద్ధు ఫిక్స్ అయి ఉండటం వల్ల.. అతడితో ఒకప్పటి బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను సమంత ఒప్పుకోక పోయి ఉండొచ్చని భావించవచ్చు. కెరీర్ ఆరంభంలో సిద్ధుతో సమంత కొంతకాలం రిలేషన్షిప్లో ఉండటం, తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం తెలిసిందే. ఇటీవల నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోబోతున్నపుడు సమంతను ఉద్దేశించినట్లుగా సిద్ధు చేసిన ఒక ట్వీట్ వైరల్ కావడం తెలిసిందే.
This post was last modified on October 13, 2021 7:39 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…