Movie News

చిరంజీవిపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానెల్ సభ్యులకు కూడా ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ ల రాజీనామాలను స్వీకరించడం లేదని.. త్వరలోనే ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా ఆ విషయాన్ని చెప్పి.. వాళ్ల సపోర్ట్ కావాలని కోరతానని అన్నారు. ప్రకాష్ రాజ్ గారి సలహాలు, పెద్దరికం ‘మా’కు అవసరమని అన్నారు.

ఆ తరువాత రామ్ చరణ్ ఓటు కచ్చితంగా ప్రకాష్ రాజ్ గారికే వేసి ఉంటారని అన్నారు మంచు విష్ణు. ఎందుకంటే రామ్ చరణ్ తన తండ్రి మాటను జవదాటరని.. అది మంచి విషయమే అని.. తను కూడా తన తండ్రి మాటకే కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు చరణ్ ఓటు వేయలేదనే బాధ లేదని అన్నారు.

‘నన్ను ఎలెక్షన్స్ నుంచి తప్పుకోమని చిరంజీవి అంకుల్ మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ గారు పోటీ చేస్తున్నారని.. ఎలెక్షన్స్ ఎందుకు ఆయన్నే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని చిరంజీవి గారు చెబితే.. కుదరని నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయని మంచు విష్ణు వివరించారు.

ఆ తరువాత ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదనే విషయంపై స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాల వలన రాలేకపోయారని.. కానీ తను గెలిచిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ నుంచే అని చెప్పారు మంచు విష్ణు. అతడి సపోర్ట్ ఎప్పుడూ తనకు ఉంటుందని అన్నారు.

This post was last modified on October 11, 2021 8:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 minute ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

5 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 hours ago