Movie News

షారుఖ్ ని టార్గెట్ చేస్తూ కంగనా పోస్ట్!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్‌ లా దూసుకుపోయే ఆమె సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా సమంత-నాగచైతన్య విడాకులకు ఆమిర్ ఖాన్ కారణమంటూ అతడిని మధ్యలోకి లాగేసింది. ఆ తరువాత ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కి మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.

డ్రగ్స్ కేసు విషయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్‌కి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ కూడా తన కొడుకు బెయిల్ కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో పేరున్న లాయర్ ను రంగంలోకి దింపి తన కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హాంకాంక్ యాక్షన్ హీరో జాకీచాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ షారుఖ్ ని టార్గెట్ చేసింది కంగనా.

జాకీచాన్ కుమారుడు జైసీచాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జానీచాన్ అది తన ఫెయిల్యూర్ అని అందరికీ క్షమాపణలు చెప్పాడు. కేసులో తన కొడుకుని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనని జాకీచాన్ చెప్పాడు. అంతేకాకుండా.. జైసీచాన్ ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చిన తరువాత కూడా జాకీచాన్ అందరికీ సారీ చెప్పాడని కంగనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ఇలా కావాలనే షారుఖ్ ని టార్గెట్ చేసి ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on October 11, 2021 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago