బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఫైర్బ్రాండ్ లా దూసుకుపోయే ఆమె సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా సమంత-నాగచైతన్య విడాకులకు ఆమిర్ ఖాన్ కారణమంటూ అతడిని మధ్యలోకి లాగేసింది. ఆ తరువాత ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కి మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.
డ్రగ్స్ కేసు విషయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్కి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ కూడా తన కొడుకు బెయిల్ కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో పేరున్న లాయర్ ను రంగంలోకి దింపి తన కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హాంకాంక్ యాక్షన్ హీరో జాకీచాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ షారుఖ్ ని టార్గెట్ చేసింది కంగనా.
జాకీచాన్ కుమారుడు జైసీచాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జానీచాన్ అది తన ఫెయిల్యూర్ అని అందరికీ క్షమాపణలు చెప్పాడు. కేసులో తన కొడుకుని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనని జాకీచాన్ చెప్పాడు. అంతేకాకుండా.. జైసీచాన్ ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చిన తరువాత కూడా జాకీచాన్ అందరికీ సారీ చెప్పాడని కంగనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ఇలా కావాలనే షారుఖ్ ని టార్గెట్ చేసి ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on October 11, 2021 1:56 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…