బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఫైర్బ్రాండ్ లా దూసుకుపోయే ఆమె సినీ, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా సమంత-నాగచైతన్య విడాకులకు ఆమిర్ ఖాన్ కారణమంటూ అతడిని మధ్యలోకి లాగేసింది. ఆ తరువాత ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కి మద్దతుగా నిలిచిన హృతిక్ రోషన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ పై మండిపడుతూ పోస్ట్ పెట్టింది.
డ్రగ్స్ కేసు విషయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్కి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ కూడా తన కొడుకు బెయిల్ కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో పేరున్న లాయర్ ను రంగంలోకి దింపి తన కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హాంకాంక్ యాక్షన్ హీరో జాకీచాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ షారుఖ్ ని టార్గెట్ చేసింది కంగనా.
జాకీచాన్ కుమారుడు జైసీచాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జానీచాన్ అది తన ఫెయిల్యూర్ అని అందరికీ క్షమాపణలు చెప్పాడు. కేసులో తన కొడుకుని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనని జాకీచాన్ చెప్పాడు. అంతేకాకుండా.. జైసీచాన్ ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చిన తరువాత కూడా జాకీచాన్ అందరికీ సారీ చెప్పాడని కంగనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ఇలా కావాలనే షారుఖ్ ని టార్గెట్ చేసి ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on October 11, 2021 1:56 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…