హీరోయిన్గా ఉన్నన్నాళ్లూ ఫిజిక్ మీద అత్యంత జాగ్రత్త వహించాల్సిందే. ఏమాత్రం షేపౌట్ అయినట్లు కనిపించినా నెగెటివ్ కామెంట్లు పడిపోతాయి. అందుకే ఎన్నో త్యాగాలు చేస్తూ, కడుపు మాడ్చుకుని, నిత్యం వర్కవుట్లు చేస్తూ జాగ్రత్తగా ఫిజిక్ కాపాడుకుంటూ వస్తారు హీరోయిన్లు. ఇక అవకాశాలు ఆగిపోయి, సినిమాలు తగ్గిపోయి, వ్యక్తిగత జీవితంలో స్థిరపడగానే చాలామంది హీరోయిన్లకు లిమిటేషన్లన్నీ పక్కన పెట్టేసి నచ్చింది తినేస్తుంటారు. వర్కవుట్లు కూడా మానేస్తుంటారు. దీనికి తోడు ఇంకేవైనా ఆరోగ్య పరమైన సమస్యలున్నా కూడా వారి అవతారంలో మార్పు వచ్చేస్తుంటుంది.
ఇలా హీరోయిన్గా కెరీర్ ముగించిన కొన్నేళ్లకే గుర్తు పట్టలేని విధంగా తయారైన అమ్మాయిలు చాలామందే కనిపిస్తారు. నిన్నటితరం హీరోయిన్లలో చాలామంది బాగా లావైపోయి జనాలకు షాకిచ్చిన వాళ్లే. కన్నడ భామ రక్షితలో వచ్చిన మార్పు అందరూ చూశారు.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన ఒక హీరోయిన్ షాకింగ్ అవతారంతో చాలా ఏళ్ల తర్వాత జనాల ముందుకు వచ్చి విస్మయానికి గురి చేసింది. ఆమే.. రవళి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ‘పెళ్ళిసందడి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది రవళి. ఆ సినిమా చలవతో ఆమె పెద్ద పెద్ద స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. ఒక ఐదారేళ్లు కథానాయికగా మంచి ఊపులో సాగిన ఆమె.. ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయింది. తర్వాత ఆమె ఎక్కడుందో ఏమైందో ఎవరికీ తెలియదు.
పెళ్ళి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయిన రవళి.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్ళిసంద-డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుముంది. పాత ‘పెళ్ళిసందడి’లో నటించిన హీరో శ్రీకాంత్, మరో హీరోయిన్ దీప్తి భట్నాగర్ సైతం ఈ వేడుకకు వచ్చారు. ఐతే వీళ్లందరి మధ్య రవళినే షాకింగ్ లుక్లో కనిపించింది. బాగా లావైపోయి ఈమేనా రవళి అనిపించింది. తనను జనాలు గుర్తు పట్టడం లేదన్న కారణంతోనే సినిమా వేడుకలకు రావట్లేదని రవళి చెప్పడం విశేషం.
This post was last modified on October 11, 2021 12:30 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…