మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇండస్ట్రీ పెద్ద చిచ్చునే రేపినట్లున్నాయి. మామూలుగా ఎన్నికల ముంగిట వాదోపవాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే ప్రత్యర్థులు.. ఎన్నికల అనంతరం మామూలైపోతారు. కలిసి కూడా పని చేస్తుంటారు. కానీ ఈసారి మాటల దాడి మరీ తీవ్ర స్థాయికి చేరిపోవడం, ఎన్నికల్లో విజయం మరీ ప్రతిష్ఠాత్మకం అయిపోవడం.. ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తడంతో ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి.
ప్రకాష్ రాజ్ ప్యానెల్కు మద్దతు ప్రకటించిన నాగబాబు.. ఆయన ఓటమి నేపథ్యంలో ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. ‘మా’లో ప్రాంతీయ వాదం, సంకుచితత్వం ఎక్కువైపోయిందని.. ఇలాంటి సంఘంలో తాను ఉండలేనని పేర్కొంటూ రెండు రోజుల్లో ‘మా’కు తన రాజీనామా లేఖ అందుతుందని నాగబాబు ప్రకటించారు.
నిన్న రాత్రి నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ సైతం ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు ప్రకాష్ రాజ్. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారని, తాను తెలుగువాడిని కాదు కాబట్టి తనను ఓడించారని.. అలాంటపుడు తాను ‘మా’ సభ్యుడిగా ఉండటంలో అర్థం లేదని, అందుకే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయనన్నారు. అయితే తెలుగులో నటించడం మాత్రం కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అండ ఉండటంతో ఒక దశలో ప్రకాష్ రాజే అధ్యక్ష పదవికి ఫేవరెట్గా కనిపించారు. కానీ ఎన్నికల ముంగిట పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మంచు విష్ణు వ్యూహాత్మకంగా దూసుకుపోయాడు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, మన వాడిని గెలిపించుకుందాం అనే భావనను అతడి ప్యానెల్ సభ్యుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతో విష్ణు ఘనవిజయం సాధించాడు. దీన్ని జీర్ణించుకోలేక ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి దూరం కావాాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on October 11, 2021 12:24 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…