అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రకటించకముందు నుంచే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవారు. గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఇంటీరియర్, రెన్నొవేషన్ వర్క్ మొత్తం పూర్తయ్యాక కొత్తింట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ బంగ్లా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి గానీ చైతు అక్కడకు వెళ్లలేరు. అలా అని తన ఫ్యామిలీతో కలిసి ఈ టైమ్ లో ఉండడం చైతుకి ఇష్టం లేదట. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు చైతు. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.
ఇటీవలే చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే డైరెక్టర్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు కనిపించబోతున్నాడు. వీటితో పాటు ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
This post was last modified on October 10, 2021 6:08 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…