అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రకటించకముందు నుంచే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవారు. గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఇంటీరియర్, రెన్నొవేషన్ వర్క్ మొత్తం పూర్తయ్యాక కొత్తింట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ బంగ్లా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి గానీ చైతు అక్కడకు వెళ్లలేరు. అలా అని తన ఫ్యామిలీతో కలిసి ఈ టైమ్ లో ఉండడం చైతుకి ఇష్టం లేదట. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు చైతు. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.
ఇటీవలే చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే డైరెక్టర్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు కనిపించబోతున్నాడు. వీటితో పాటు ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…