అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రకటించకముందు నుంచే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవారు. గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఇంటీరియర్, రెన్నొవేషన్ వర్క్ మొత్తం పూర్తయ్యాక కొత్తింట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ బంగ్లా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి గానీ చైతు అక్కడకు వెళ్లలేరు. అలా అని తన ఫ్యామిలీతో కలిసి ఈ టైమ్ లో ఉండడం చైతుకి ఇష్టం లేదట. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు చైతు. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.
ఇటీవలే చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే డైరెక్టర్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు కనిపించబోతున్నాడు. వీటితో పాటు ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
This post was last modified on October 10, 2021 6:08 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…