అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రకటించకముందు నుంచే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవారు. గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఇంటీరియర్, రెన్నొవేషన్ వర్క్ మొత్తం పూర్తయ్యాక కొత్తింట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ బంగ్లా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి గానీ చైతు అక్కడకు వెళ్లలేరు. అలా అని తన ఫ్యామిలీతో కలిసి ఈ టైమ్ లో ఉండడం చైతుకి ఇష్టం లేదట. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు చైతు. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.
ఇటీవలే చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే డైరెక్టర్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు కనిపించబోతున్నాడు. వీటితో పాటు ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…