‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రకటన వచ్చేసింది. ఐతే ఈ డేట్ చూసి మెగా అభిమానుల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముందు నుంచి టాలీవుడ్ ఒరవడి గమనిస్తే.. ఫిబ్రవరిలో ఏ భారీ చిత్రాలూ విడుదలైన దాఖలాలు పెద్దగా కనిపించవు. సంక్రాంతి, వేసవి, దసరా, క్రిస్మస్.. ఇలాంటి క్రేజీ సీజన్లనే పెద్ద సినిమాల కోసం ఎంచుకుంటారు. అవి కాకుంటే వేసవి తర్వాత, సంక్రాంతికి ముందు ఏ నెలలో సినిమాను రిలీజ్ చేసినా పర్వాలేదన్నట్లే ఉంటుంది.
తెలుగులో అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ సీజన్గా భావించేది, పెద్ద సినిమాలకు ఏమాత్రం అనువు కాని సీజన్ అంటే అది ఫిబ్రవరి-మార్చి మధ్యనే. రిపబ్లిక్ డే వీకెండ్ తర్వాత.. మార్చి చివరి వారానికి ముందు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం చాలా అరుదు. టాలీవుడ్లో భారీ విజయాన్నందుకున్న సినిమాల లిస్టు తీస్తే ఈ సీజన్లో రిలీజైన చిత్రాలు దాదాపుగా కనిపించవు. ఇలాంటి సీజన్లో చిరంజీవి సినిమా రిలీజ్ చేయడం అభిమానులకు ఎంతమాత్రం రుచిస్తున్నట్లు లేదు.
నిజానికి ‘ఆచార్య’ను డిసెంబరు 17న రిలీజ్ చేస్తున్నట్లుగా ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఐతే అదే తేదీకి ‘పుష్ప’ ఫిక్స్ అయి ఉండటంతో అలా ెలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే ‘పుష్ప’ను వాయిదా వేయించి, చిరు సినిమాను క్రిస్మస్ ముంగిట రిలీజ్ చేస్తారని అన్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. చిరునే కాంప్రమైజ్ అయ్యాడు. ఈ విషయంలోనూ చిరు అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ మధ్య బన్నీ ‘మెగా’ నీడ నుంచి బయటికొచ్చి సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న నేపథ్యంలో మెగా అభిమానుల్లోనే ఓ వర్గం అతణ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య, పుష్ప సినిమాల రిలీజ్ డేట్ల విషయమై చిరు-బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్ నడుస్తోంది. ఇప్పుడు బన్నీకి ఆ డేట్ వదిలేసి చిరు అన్ సీజన్లో తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇప్పుడు కుదరదంటే వేసవికి మార్చి నెలాఖరుకైనా వెళ్లాల్సింది కానీ.. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…