Movie News

సిద్ధు కొల్లగొట్టేశాడబ్బా..

త్వరలోనే తెలుగులో మరో మల్టీస్టారర్ మూవీ చూడబోతున్నాం. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మహాసముద్రం’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సంచలనం రేపిన యువ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. మామూలుగా చూస్తే శర్వా, సిద్ధులది ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సమాన స్థాయే.

కాకపోతే సిద్ధు చివరగా తెలుగులో చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. చాలా ఏళ్ల నుంచి సిద్ధు తెలుగులో సినిమా చేయకపోవడం అతడికి మైనస్. కానీ ఒక దశలో అయితే శర్వాను మించిన ఇమేజ్ అతడి సొంతం. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేదతడికి. కానీ సరైన సినిమాలు ఎంచుకోక అతను ఆ క్రేజ్‌ను, మార్కెట్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఇక తెలుగులో మళ్లీ కనిపించడేమో అనుకున్నవాడు.. చాలా గ్యాప్ తర్వాత తనకు నచ్చిన కథతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఐతే శర్వా, సిద్ధు నటించారు కాబట్టి ఇది ఇద్దరు హీరోల సినిమా అని, మల్టీస్టారర్ అనే అందరూ అనుకుంటుంటే.. సిద్ధు మాత్రం ఇది మల్టీస్టారర్ కాదు అంటుండటం విశేషం. ఎవరేమి అనుకున్నా కానీ.. తన దృష్టిలో మాత్రం ‘మహాసముద్రం’ శర్వా సినిమా అని.. ఎప్పటికీ దీన్ని అలాగే చూస్తానని సిద్ధు అన్నాడు. తాను కేవలం అతడి పక్కన నిలబడ్డానని, అందుకు తాను గర్విస్తానని చెప్పాడు. శర్వా వల్లే ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందని, అతడి వల్లే ఇదొక మాస్ సినిమాగా మారి ఇంత మందికి రీచ్ అవుతోందని సిద్ధు పేర్కొనడం విశేషం.

మామూలుగా సిద్ధు యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో, మీడియా ముందుకు వచ్చినపుడు కొంచెం పొగరుగానే మాట్లాడుతుంటాడు. వివాదాస్పద కామెంట్లు చేస్తుంటాడు. అలాంటివాడు ‘మహాసముద్రం’ మల్టీస్టారర్ కాదని, ఇది శర్వా సినిమా అని పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత ఓపెన్ మైండ్‌తో ఆలోచించి ఆ కామెంట్ చేయడం ద్వారా సిద్ధు అందరి మనసులూ కొల్లగొట్టేశాడు. దీంతో పాటు తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి అతను చెప్పిన మాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

This post was last modified on October 10, 2021 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

5 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

31 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago