దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా తెరపైకి వచ్చిందనే విషయంలో ఓ ఆసక్తికర స్టోరీ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ కి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారాయన. ‘కొండపొలం’ నవల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆ పుస్తకాన్ని చదివారు.
చదివిన వెంటనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. దీంతో నవల హక్కుల గురించి ఆరా తీశారు. ‘పుష్ప’ సినిమా తరువాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా సినిమా తీయాలని భావించారు. కానీ ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందో.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పుడు కూడా తన శిష్యులకి ఎవరికైనా ఈ నవల ఇచ్చి.. సినిమా తీయమంటే ఎలా ఉంటుందా అని ఆలోచించారట.
కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేశారు. నిజానికి దర్శకుడు క్రిష్ కి ‘కొండపొలం’ నవలను ముందుగా పరిచయం చేసింది సుకుమార్ అని తెలుస్తోంది. అలా క్రిష్ ఈ సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఒకరకంగా కారణమయ్యారు. అన్నీ వర్కవుట్ అయ్యి సుకుమార్ గనుక ‘కొండపొలం’ సినిమా తీసి ఉంటే కచ్చితంగా మరోకోణంలో సినిమాను చూసేవాళ్లం. ఎందుకంటే క్రిష్ వర్కింగ్ స్టైల్, సుకుమార్ వర్కింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
This post was last modified on October 9, 2021 1:51 pm
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…
ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…