Movie News

‘కొండపొలం’.. సుకుమార్ చేయాలనుకున్నారట!

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా తెరపైకి వచ్చిందనే విషయంలో ఓ ఆసక్తికర స్టోరీ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ కి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారాయన. ‘కొండపొలం’ నవల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆ పుస్తకాన్ని చదివారు.

చదివిన వెంటనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. దీంతో నవల హక్కుల గురించి ఆరా తీశారు. ‘పుష్ప’ సినిమా తరువాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా సినిమా తీయాలని భావించారు. కానీ ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందో.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పుడు కూడా తన శిష్యులకి ఎవరికైనా ఈ నవల ఇచ్చి.. సినిమా తీయమంటే ఎలా ఉంటుందా అని ఆలోచించారట.

కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేశారు. నిజానికి దర్శకుడు క్రిష్ కి ‘కొండపొలం’ నవలను ముందుగా పరిచయం చేసింది సుకుమార్ అని తెలుస్తోంది. అలా క్రిష్ ఈ సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఒకరకంగా కారణమయ్యారు. అన్నీ వర్కవుట్ అయ్యి సుకుమార్ గనుక ‘కొండపొలం’ సినిమా తీసి ఉంటే కచ్చితంగా మరోకోణంలో సినిమాను చూసేవాళ్లం. ఎందుకంటే క్రిష్ వర్కింగ్ స్టైల్, సుకుమార్ వర్కింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.

This post was last modified on October 9, 2021 1:51 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago