దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా తెరపైకి వచ్చిందనే విషయంలో ఓ ఆసక్తికర స్టోరీ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ కి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారాయన. ‘కొండపొలం’ నవల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆ పుస్తకాన్ని చదివారు.
చదివిన వెంటనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. దీంతో నవల హక్కుల గురించి ఆరా తీశారు. ‘పుష్ప’ సినిమా తరువాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా సినిమా తీయాలని భావించారు. కానీ ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందో.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పుడు కూడా తన శిష్యులకి ఎవరికైనా ఈ నవల ఇచ్చి.. సినిమా తీయమంటే ఎలా ఉంటుందా అని ఆలోచించారట.
కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేశారు. నిజానికి దర్శకుడు క్రిష్ కి ‘కొండపొలం’ నవలను ముందుగా పరిచయం చేసింది సుకుమార్ అని తెలుస్తోంది. అలా క్రిష్ ఈ సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఒకరకంగా కారణమయ్యారు. అన్నీ వర్కవుట్ అయ్యి సుకుమార్ గనుక ‘కొండపొలం’ సినిమా తీసి ఉంటే కచ్చితంగా మరోకోణంలో సినిమాను చూసేవాళ్లం. ఎందుకంటే క్రిష్ వర్కింగ్ స్టైల్, సుకుమార్ వర్కింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
This post was last modified on October 9, 2021 1:51 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…