Movie News

‘కొండపొలం’.. సుకుమార్ చేయాలనుకున్నారట!

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా తెరపైకి వచ్చిందనే విషయంలో ఓ ఆసక్తికర స్టోరీ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ కి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారాయన. ‘కొండపొలం’ నవల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే ఆ పుస్తకాన్ని చదివారు.

చదివిన వెంటనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. దీంతో నవల హక్కుల గురించి ఆరా తీశారు. ‘పుష్ప’ సినిమా తరువాత ఓ చిన్న ప్రాజెక్ట్ గా, ప్రయోగాత్మకంగా సినిమా తీయాలని భావించారు. కానీ ‘పుష్ప’ సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందో.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పుడు కూడా తన శిష్యులకి ఎవరికైనా ఈ నవల ఇచ్చి.. సినిమా తీయమంటే ఎలా ఉంటుందా అని ఆలోచించారట.

కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టేశారు. నిజానికి దర్శకుడు క్రిష్ కి ‘కొండపొలం’ నవలను ముందుగా పరిచయం చేసింది సుకుమార్ అని తెలుస్తోంది. అలా క్రిష్ ఈ సినిమా తీయడానికి సుకుమార్ కూడా ఒకరకంగా కారణమయ్యారు. అన్నీ వర్కవుట్ అయ్యి సుకుమార్ గనుక ‘కొండపొలం’ సినిమా తీసి ఉంటే కచ్చితంగా మరోకోణంలో సినిమాను చూసేవాళ్లం. ఎందుకంటే క్రిష్ వర్కింగ్ స్టైల్, సుకుమార్ వర్కింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

3 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

4 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

4 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

5 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

5 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

6 hours ago