షారుఖ్ ఖాన్ కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో ఎవరెవరో కల్పించుకుని చేసే కామెంట్స్ అంతకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్యన్కి సపోర్ట్గా కామెంట్స్ పెట్టారు. మరికొందరు తప్పుబట్టారు. ఇప్పుడు మోడల్, నటి సోమీ అలీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ ఆమె మాట్లాడిన విధానం అందరికీ షాకిచ్చింది.
‘పిల్లలు డ్రగ్స్ వాడటం సహజం. నేను కూడా పదిహేడేళ్ల వయసులో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేశాను. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు. అమెరికా ఎప్పటి నుంచో డ్రగ్స్ గురించి పోరాడుతోంది. కానీ ఇప్పటికీ అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. వాటిని పూర్తిగా తొలగించలేం. అలాగే వ్యభిచారం కూడా. ఈ రెండూ పెద్ద తప్పేం కాదు. ఆర్యన్ని వదిలేయండి. చిన్నపిల్లాడిపై ప్రతాపం చూపించే బదులు రేపిస్టులని, క్రిమినల్స్ని పట్టుకోండి’ అంది సోమీ.
ఆమె మాటలకి సోషల్ యాక్టివిస్టులు మండి పడుతున్నారు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి డ్రగ్స్ తీసుకోమని, వ్యభిచారం చేయమని ఎంకరేజ్ చేయడమేంటి అని తిడుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ వాళ్లకి కూడా సోమీ మాటలు కోపం తెప్పించాయి. ఎప్పుడో చనిపోయిన దివ్యభారతిని ఎందుకు దీనిలోకి లాగడం, ఎవరి ఒపీనియన్స్ వాళ్లు చెప్పుకోవాలి తప్ప పక్కవారి మీద బురద చల్లకూడదు అంటు కాస్త గట్టిగానే క్లాస్ పీకుతున్నారు.
ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వ్యభిచారం తప్పు కాదన్న ఇదే సోమీ, ఆమధ్య బాలీవుడ్ విపరీత పోకడల మీద, వేధింపుల మీద పెద్ద లెక్చర్ ఇచ్చింది. సోమీ ఒకప్పుడు సల్మాన్కి గాళ్ ఫ్రెండ్. చాలాకాలం లవ్లో ఉన్నాక విడిపోయారు. దాని గురించి కూడా మొన్న ఓ సందర్భంలో మాట్లాడింది. సల్మాన్ తనని మోసం చేశాడని, అతనికి ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందో లెక్కే లేదని, అలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంది. ఇండస్ట్రీలో ఆడపిల్లకి వేధింపులు ఉన్నాయని, తను కూడా వాటిని ఫేస్ చేశానని అంది. ఆరోజు అన్ని మాట్లాడిన మనిషి ఈరోజు ఇలా చీప్ కామెంట్స్ చేయడమేంటి అంటున్నారంతా. నేరాల్ని సమర్థించే ఇలాంటి వాళ్ల మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నవాళ్లూ లేకపోలేదు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…