షారుఖ్ ఖాన్ కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో ఎవరెవరో కల్పించుకుని చేసే కామెంట్స్ అంతకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్యన్కి సపోర్ట్గా కామెంట్స్ పెట్టారు. మరికొందరు తప్పుబట్టారు. ఇప్పుడు మోడల్, నటి సోమీ అలీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ ఆమె మాట్లాడిన విధానం అందరికీ షాకిచ్చింది.
‘పిల్లలు డ్రగ్స్ వాడటం సహజం. నేను కూడా పదిహేడేళ్ల వయసులో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేశాను. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు. అమెరికా ఎప్పటి నుంచో డ్రగ్స్ గురించి పోరాడుతోంది. కానీ ఇప్పటికీ అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. వాటిని పూర్తిగా తొలగించలేం. అలాగే వ్యభిచారం కూడా. ఈ రెండూ పెద్ద తప్పేం కాదు. ఆర్యన్ని వదిలేయండి. చిన్నపిల్లాడిపై ప్రతాపం చూపించే బదులు రేపిస్టులని, క్రిమినల్స్ని పట్టుకోండి’ అంది సోమీ.
ఆమె మాటలకి సోషల్ యాక్టివిస్టులు మండి పడుతున్నారు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి డ్రగ్స్ తీసుకోమని, వ్యభిచారం చేయమని ఎంకరేజ్ చేయడమేంటి అని తిడుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ వాళ్లకి కూడా సోమీ మాటలు కోపం తెప్పించాయి. ఎప్పుడో చనిపోయిన దివ్యభారతిని ఎందుకు దీనిలోకి లాగడం, ఎవరి ఒపీనియన్స్ వాళ్లు చెప్పుకోవాలి తప్ప పక్కవారి మీద బురద చల్లకూడదు అంటు కాస్త గట్టిగానే క్లాస్ పీకుతున్నారు.
ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వ్యభిచారం తప్పు కాదన్న ఇదే సోమీ, ఆమధ్య బాలీవుడ్ విపరీత పోకడల మీద, వేధింపుల మీద పెద్ద లెక్చర్ ఇచ్చింది. సోమీ ఒకప్పుడు సల్మాన్కి గాళ్ ఫ్రెండ్. చాలాకాలం లవ్లో ఉన్నాక విడిపోయారు. దాని గురించి కూడా మొన్న ఓ సందర్భంలో మాట్లాడింది. సల్మాన్ తనని మోసం చేశాడని, అతనికి ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందో లెక్కే లేదని, అలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంది. ఇండస్ట్రీలో ఆడపిల్లకి వేధింపులు ఉన్నాయని, తను కూడా వాటిని ఫేస్ చేశానని అంది. ఆరోజు అన్ని మాట్లాడిన మనిషి ఈరోజు ఇలా చీప్ కామెంట్స్ చేయడమేంటి అంటున్నారంతా. నేరాల్ని సమర్థించే ఇలాంటి వాళ్ల మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నవాళ్లూ లేకపోలేదు.
This post was last modified on October 9, 2021 12:49 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…