ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశాల్లో ఒకటిగా మారిపోయింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం. గత రెండు పర్యాయాలు కూడా మా ఎన్నికల విషయంలో కొంత రచ్చ జరిగింది కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడూ రసాభాస కాలేదు. ప్రకాష్రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు ఎంత తీవ్ర స్థాయిలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు ఇరు వర్గాలకూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. వారి మద్దతుదారులు కూడా ఎన్నికల్ని అంతే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా జాగ్రత్త పడుతున్నారు కూడా. ఇలాంటి సమయంలో మాలో సభ్యుడైన తమిళ నటుడు సిద్దార్థ్.. ఈ ఎన్నికలపై ఆసక్తికర రీతిలో స్పందించాడు. తాను కూడా మా ఎన్నికల్లో ఓటు వేయబోతున్నట్లు అతను వెల్లడించాడు.
చాలా ఏళ్ల తర్వాత తెలుగులో మహాసముద్రం సినిమాలో నటించిన సిద్ధు.. దసరాకు ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చి మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా మా ఎన్నికల గురించి అడిగితే.. ఈ ఎన్నికల వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నా. నేను ఇరు వర్గాలు ఏం చెబుతారో వింటా. చివరగా నాకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తా అని సిద్దార్థ్ చెప్పాడు.
ఇక తెలుగు సినిమాల నుంచి చాన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. తనకు నచ్చిన స్క్రిప్టు దొరక్కపోవడం వల్లే విరామం తీసుకున్నానని.. ఇప్పుడు మహాసముద్రం లాంటి షాకింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని.. ఈ సినిమా స్యూర్ షాట్ బ్లాక్బస్టర్ అని.. దీని తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని సిద్ధు చెప్పాడు. అజయ్ తనకు ఈ కథ చెప్పగానే తన మేకప్మ్యాన్కు ఫోన్ చేసి ఇంతకుముందు ఏ సినిమాలో లేని విధంగా తన లుక్ ఉండాలని చెప్పి కొత్తగా తయారయ్యానని.. తన పాత్ర సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అతనన్నాడు.
This post was last modified on October 9, 2021 1:28 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…