ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతడిని ఎన్సీబీకి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుని స్పెషల్ కోర్టుకి అప్పగించింది. శుక్రవారం నాడు కొనసాగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ రూల్స్ ప్రకారం.. వచ్చే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో పెట్టనున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి అర్హులని.. ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మెజిస్ట్రేట్ కోర్టుకి తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. నిజానికి ఈసారి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ముంబై తీరంలో జరిగిన క్రూజ్ పార్టీలో డ్రస్గ్ తీసుకుంటున్నారని.. గత వారం ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందికి ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే తన దగ్గర డ్రగ్స్ లేకపోయినా.. తన ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఇటీవల కోర్టులో వెల్లడించారు ఆర్యన్ ఖాన్. ఇన్ని రోజులుగా తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పారు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. పార్టీకి ఎలా వెళ్లానో చెక్ చేసుకోమని కోర్టులో చెప్పారు ఆర్యన్.
This post was last modified on October 9, 2021 1:23 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…