ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతడిని ఎన్సీబీకి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుని స్పెషల్ కోర్టుకి అప్పగించింది. శుక్రవారం నాడు కొనసాగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ రూల్స్ ప్రకారం.. వచ్చే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో పెట్టనున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి అర్హులని.. ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మెజిస్ట్రేట్ కోర్టుకి తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. నిజానికి ఈసారి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ముంబై తీరంలో జరిగిన క్రూజ్ పార్టీలో డ్రస్గ్ తీసుకుంటున్నారని.. గత వారం ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందికి ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే తన దగ్గర డ్రగ్స్ లేకపోయినా.. తన ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఇటీవల కోర్టులో వెల్లడించారు ఆర్యన్ ఖాన్. ఇన్ని రోజులుగా తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పారు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. పార్టీకి ఎలా వెళ్లానో చెక్ చేసుకోమని కోర్టులో చెప్పారు ఆర్యన్.
This post was last modified on October 9, 2021 1:23 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…