ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతడిని ఎన్సీబీకి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుని స్పెషల్ కోర్టుకి అప్పగించింది. శుక్రవారం నాడు కొనసాగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ రూల్స్ ప్రకారం.. వచ్చే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో పెట్టనున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి అర్హులని.. ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మెజిస్ట్రేట్ కోర్టుకి తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. నిజానికి ఈసారి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ముంబై తీరంలో జరిగిన క్రూజ్ పార్టీలో డ్రస్గ్ తీసుకుంటున్నారని.. గత వారం ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందికి ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే తన దగ్గర డ్రగ్స్ లేకపోయినా.. తన ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఇటీవల కోర్టులో వెల్లడించారు ఆర్యన్ ఖాన్. ఇన్ని రోజులుగా తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పారు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. పార్టీకి ఎలా వెళ్లానో చెక్ చేసుకోమని కోర్టులో చెప్పారు ఆర్యన్.
This post was last modified on October 9, 2021 1:23 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…