ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతడిని ఎన్సీబీకి కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుని స్పెషల్ కోర్టుకి అప్పగించింది. శుక్రవారం నాడు కొనసాగిన విచారణలో ఆర్యన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ రూల్స్ ప్రకారం.. వచ్చే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైల్లో క్వారెంటైన్ సెల్ లో పెట్టనున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందడానికి అర్హులని.. ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మెజిస్ట్రేట్ కోర్టుకి తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేశారు. నిజానికి ఈసారి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ముంబై తీరంలో జరిగిన క్రూజ్ పార్టీలో డ్రస్గ్ తీసుకుంటున్నారని.. గత వారం ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందికి ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే తన దగ్గర డ్రగ్స్ లేకపోయినా.. తన ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఇటీవల కోర్టులో వెల్లడించారు ఆర్యన్ ఖాన్. ఇన్ని రోజులుగా తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పారు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. పార్టీకి ఎలా వెళ్లానో చెక్ చేసుకోమని కోర్టులో చెప్పారు ఆర్యన్.
This post was last modified on October 9, 2021 1:23 am
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…