ఈమధ్య తెలుగు సినిమాల్లో గూఢచారులు ఎక్కువయ్యారు. కొన్నాళ్ల క్రితం ‘గూఢచారి’ పేరుతోనే సినిమా చేసి హిట్టు కొట్టాడు అడివి శేష్. ఇప్పుడు ఆ పాత్రతో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు చాలామంది హీరోస్. ఒకరి తర్వాత ఒకరుగా స్పై థ్రిల్లర్స్ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ కూడా ఆ వరుసలో చేరాడు.
రీసెంట్గా ‘వైల్డ్ డాగ్’లో ఎన్ఐఏ ఏజెంట్గా నటించారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ‘ది ఘోస్ట్’లోనూ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఆయన కొడుకు అఖిల్ ‘ఏజెంట్’ పేరుతో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బ్రిటిష్ కాలం నాటి గూఢచారి పాత్ర పోషిస్తున్నాడు. తనదీ అదే దారి అంటూ నిఖిల్ కూడా ఓ స్పై థ్రిల్లర్ని స్టార్ట్ చేశాడు.
గూఢచారి, ఎవరు, హిట్ వంటి చిత్రాలకు ఎడిటర్గా పని చేసిన బీహెచ్ గ్యారీ ఈ సినిమాతో డైరెక్టర్గా మారుతున్నారు. ఆయన చెప్పిన ఓ గూఢచారి కథ నచ్చడంతో నిఖిల్ ఎస్ చెప్పాడు. ఇవాళ హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించారు. రెడ్ సినిమాస్ బ్యానర్లో రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఆల్రెడీ 18 పేజెస్ చిత్రంతో పాటు ‘కార్తికేయ’ సీక్వెల్లోనూ నటిస్తున్నాడు నిఖిల్. ఇవింకా సెట్స్పై ఉండగానే మరో సినిమాని స్టార్ట్ చేయడం విశేషం. చాలాకాలం కూల్ పాత్రల్లోనే కనిపించిన తను సడెన్గా రూటు మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఈ స్పై థ్రిల్లర్కి కమిటయ్యాడు. మరి గూఢచారిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on October 8, 2021 6:51 pm
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…