మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ (మా) ఎన్నికల వ్యవహారం మునుపెన్నడూ లేని స్థాయిలో వేడెక్కి పోయింది. గత రెండు పర్యాయాలు కూడా ఎన్నికలు వాడి వేడిగానే సాగాయి కానీ.. ఈసారి ఉన్నంత తీవ్రత అయితే ఎప్పుడూ లేదు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. వారి మద్దతుదారులు మరీ ఈ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఎన్నికలు సమీపించేకొద్దీ ఇవి మరీ శ్రుతిమించిపోయాయి.
ఈ ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనపుడు.. అలాగే ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా చర్చనీయాంశంగా మారిన అంశం.. ప్రకాష్ రాజ్ స్థానికత. వేరే భాష, రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ తెలుగు సినీ నటుల కోసం ఏర్పాటు చేసుకున్న సంఘానికి అధ్యక్షుడు కావడం ఏంటన్నది కొందరి ప్రశ్న. తాజాగా రవిబాబు, రాజీవ్ కనకాల లాంటి వాళ్లు పరోక్షంగా ఈ విషయాన్ని బలంగా లేవనెత్తారు. ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ వైపు నుంచి మెగా బ్రదర్ నాగబాబు కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘‘ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదు అని ఎన్నిసార్లు అంటారు. ఆయన లోకల్ కానపుడు ‘మా’లో సభ్యత్వం ఎందుకు ఇచ్చారు? ఇక నుంచి తెలుగు వాళ్లే ‘మా’లో ఉండాలని రూల్ పెట్టండి. ‘మా’ నిబంధనల ప్రకారం నటులెవరైనా మెంబర్ కావచ్చు. ఎన్నికల్లో పోటీ కూడా చేయొచ్చు. ఒకప్పుడు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలని పర భాషా నటీనటులపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు విష్ణు రూల్స్ మార్చేస్తాడా? తెలుగులో ఎంతో మంది పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమాను ప్రపంచస్థాయి తీసుకెళ్దామని కొందరు చూస్తుంటే.. ‘నా ఇండస్ట్రీ, నేను, తెలుగువాళ్లే ఉండాలి’ అనే సంకుచిత మనస్తత్వం ఎందుకు? ఇక్కడ అతిథులు ఎవరూ లేరు.
ఒక రకంగా హైదరాబాద్లో ఉన్న మేమంతా ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లమే. ‘మీరెందుకు ఇక్కడ ఉన్నారు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనలేదే? మరి ‘మా’లో ఎందుకు ఈ ప్రశ్న తలెత్తుతోంది. లోకల్, నాన్లోకల్ అన్న భావన తనకు లేదని మొదట చెప్పింది నరేశ్. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పాడు. కానీ ఇప్పుడు మాస్క్ తీశాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువారు లేరా అనడం ఎంత వరకు సమంజసం? ‘మా’ ఎన్నికల్లో మేమూ పోటీ చేయగలం. కానీ, మాకున్న పరిస్థితులు వేరు. ప్రకాశ్రాజ్ ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఆయనకు దేశమంటే అభిమానం ఉంది. ఆయనతో నాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అయితే, ఇద్దరం కోరుకునేది ‘మా’ సంక్షేమం’’ అని నాగబాబు అన్నాడు.
This post was last modified on October 8, 2021 10:14 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…